ISRO: 2024 లో ఇస్రో చేపట్టనున్న మేజర్ ప్రాజెక్ట్స్ ఇవే.. గగన్యాన్తో సహా భారీ ప్రయోగాలకు ప్రణాళికలు
2023 సంవత్సరం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రోకి చాలా కలిసొచ్చింది. వరుసగా చంద్రయాన్ 3, ఆదిత్య L1 ప్రాజెక్టుల విజయాలతో ప్రపంచం దృష్టిని భారత్ వైపు మళ్లేలా ఇస్రో కృషి చేసింది. ఈ ఏడాది కీలక మైలురాళ్లను సాధించిన ఇస్రో.. వచ్చే ఏడాది మరిన్ని ప్రాజెక్టులను చేపట్టనుంది. ఆ వివరాలు ఈ కథనంలో..
నిసార్(NISAR): నాసా మరియు ఇస్రో సంయుక్తంగా చేపడుతున్న ప్రాజెక్ట్ నిసార్. ఈ ప్రాజెక్ట్ ద్వారా భూమి యొక్క పర్యావరణ వ్యవస్థ, సముద్ర మట్టం పెరుగుదల, సముద్రపు భూగర్భ జలాల మట్టం, ప్రకృతి సమస్యలు, భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం మొదలైన వాటి గురించి శాస్త్రవేత్తలు తెలుసుకోనున్నారు.

నిసార్ ఉపగ్రహంలో సింథటిక్ అపాచీ రాడార్ అమర్చారు. ఈ శాటిలైట్ను ఇస్రో(ISRO) ఎర్త్ ఆర్బిట్ అనే ప్రాంతానికి పంపిస్తుంది. అక్కడి నుంచి ఈ శాటిలైట్ భూమిని అధ్యయనం చేసి ఇస్రోకు డేటాను పంపుతుంది. ఈ శాటిలైట్ను జనవరిలో ప్రయోగించనున్నారు. ప్రాజెక్టు లాంచ్ అయ్యే రోజు మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇన్శాట్ 3డిఎస్(INSAT 3DS): 2024 జనవరిలో ఇస్రో ఇన్శాట్ రేడియస్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. అంతరిక్షం నుంచి భూమిని పర్యవేక్షించడానికి ఈ ఉపగ్రహం వాతావరణ సమాచారాన్ని భూమికి పంపిస్తుంది. ఇది సాధారణ ప్రాజెక్టు కావడంతో ఇస్రో దీనిని సులభంగా చేపడుతుంది.

ఈ ప్రాజెక్టు కోసం ఈ ఉపగ్రహంలో 6 ఇమేజ్ ఛానెల్లు మరియు 19 సౌండ్ ఛానెల్లను అమర్చారు. భూమిపై జరిగే వాతావరణ మార్పులకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని రియల్ టైమ్లో ఇస్రో కేంద్రానికి చేరవేసేలా ఇన్శాట్ 3DS ను రూపొందించారు. ఈ ఉపగ్రహం వాతావరణ సమాచారాన్ని చాలా ఖచ్చితంగా ట్రాక్ చేయగలుగుతుంది.
గగన్యాన్ 1(GaganYaan): దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్న ఇస్రో అతిపెద్ద మిషన్ గగన్యాన్ మిషన్. NASA ఆర్టెమిస్ మిషన్ వలె, ISRO దీనిని మూడు దశల్లో నిర్వహించనుంది. దీనిలో భాగంగా మొదటి రెండు దశలు 2024 లో పూర్తవుతాయని అంచనా. గగన్యాన్ 1 జనవరి లేదా ఫిబ్రవరి 2024లో ప్రారంభిస్తారు. ఈ అన్క్రూడ్ మిషన్ వ్యోమనౌక వ్యవస్థలను టెస్ట్ చేస్తుంది.

ఇక గగన్యాన్ 2లో, ఒక మానవరూపాన్ని(రోబో) అంతరిక్షంలోకి పంపిస్తారు. తద్వారా వాహనం యొక్క రీఎంట్రీ మరియు ల్యాండింగ్ వ్యవస్థను టెస్ట్ చేస్తారు. గగన్యాన్ మూడో దశ 2025లో పూర్తవుతుందని సమాచారం. ఇందులో ముగ్గురు భారతీయులను మూడు రోజుల పాటు భూమి కక్ష్యలోకి పంపి తిరిగి భూమికి తీసుకువచ్చేలా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.
మంగళయాన్ 2(Mangalyaan 2): మంగళయాన్ ప్రాజెక్ట్తో ఇస్రో ఇప్పటికే భారీ విజయాన్ని సాధించగా.. మార్స్ ఆర్బిటర్ మిషన్ కోసం రెండవ ప్రాజెక్ట్ మంగళయాన్ 2 సిద్ధమవుతోంది. దీని ప్రకారం 2024 సంవత్సరంలో ఈ ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇది సక్సెస్ అయితే ఇస్రోకు ఇదే అతిపెద్ద అచీవ్మెంట్ ప్రాజెక్ట్ కానుంది.

మంగళ్యాన్ 2 మిషన్ మొత్తం 4 వేర్వేరు పేలోడ్లను కలిగి ఉంటుంది. ఇది అంగారక గ్రహానికి అతి సమీపంలోకి వెళ్లి అంగారకుడిపై అన్ని పరిశోధనలను చేయనుంది. దాదాపు 100 కిలోల బరువున్న ఈ వ్యోమనౌక ప్రస్తుతం ప్రయోగానికి సిద్ధమైందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. మంగళయాన్ 2 గతంలో ప్రయోగించిన మంగళయాన్ వ్యోమనౌక కంటే సాంకేతికంగా మరింత అభివృద్ధి చేశారు.
X-ray Polarimeter ఉపగ్రహం: ఈ ప్రాజెక్టు ద్వారా అంతరిక్షం నుండి భూమికి చేరే X-కిరణాలను అధ్యయనం చేయనున్నారు. ఈ శాటిలైట్లు ప్రధానంగా బ్లాక్ హోల్స్ మరియు న్యూట్రాన్ నక్షత్రాల నుండి భూమికి వచ్చే ఎక్స్-కిరణాలను విశ్లేషిస్తాయి. తద్వారా వాటి నుండి పొందిన డేటాను ఉపయోగించడం ద్వారా స్పేస్ను బాగా అర్థం చేసుకోవడానికి సహకరిస్తుంది. దీనికి సంబంధించిన లాంచ్ వర్క్ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి.

శుక్రయాన్(Sukhrayana): శుక్రుడిని అన్వేషించడానికి ఈ అంతరిక్ష నౌక శుక్రయాన్ను సిద్ధం చేస్తోంది ఇస్రో. ఈ వ్యోమనౌకను 2024లో ప్రయోగించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఇది వీనస్ చుట్టూ ప్రదక్షిణ చేసి దాని అగ్నిపర్వతాలు, భూ వ్యవస్థలు మరియు గ్రహం-నిర్దిష్ట కార్యకలాపాలను అధ్యయనం చేయనుంది.

అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభం అవుతుందనే దానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. 2023 మాదిరిగానే 2024 లో ఇస్రో 2024లో కీలక మైలురాళ్లను సాధించేందుకు కృషి చేస్తోంది. ఇందుకు అనుగుణంగా సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ విజయవంతం అయితే 2024 కూడా ఇస్రోకు కలిసిరానుంది.


Click it and Unblock the Notifications








