కొత్తగా కొనుగోలు చేసిన బస్సులను తిరిగి ఇవ్వనున్న ఉత్తరాఖండ్ రవాణా శాఖ
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన బస్సులలో కొన్ని లోపాలు ఉన్నాయని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ బృందం గుర్తుంచారు. అవి ఏమిటంటే కొత్తగా కొనుగోలు చేసిన బస్సుల గేర్ లేవేర్స్ యొక్క నిర్మాణంలో నాణ్యత లేకపోవడం ప్రధానలోపంగా చెప్పారు. ఈ విధమైన గేర్ లేవేర్స్ ఉంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగి చాలావరకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని వీరు భావించారు.

ఈవిధమైన లోపాలు ఉన్న కారణంగా ఆ బస్సులను తిరిగి టాటా మోటార్స్ విక్రేతకే ఇచ్చేయాలని ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నిర్ణయించింది.

ఉత్తరాఖండ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఎండి రణ్వీర్ సింగ్ మాట్లాడుతూ సిఐఆర్టి బృందం కొత్తగా కొనుగోలు చేసిన బస్సులను శనివారం పరిశీలించి ఆదివారం తన నివేదికను ఉత్తరాఖండ్ రాష్ట్రప్రభుత్వంలోని రవాణాశాఖ విభాగానికి సమర్పించింది అని తెలియజేశాడు.

ఇంకా కొత్తగా కొనుగోలు చేసిన బస్సులలో గేర్ లివర్ల రూపకల్పన లోపభూయిష్టంగా ఉందని, ఈ విధంగా ఉండటం వల్ల డ్రైవర్లకు అసౌకర్యంగా ఉంటుందని సిఐఆర్టి బృందం తమ నివేదికలో తెలియజేసింది.

కొత్త బస్సులలో గేర్ లివర్లలో కొన్ని అభ్యన్తరాలను తెలియజేయడంతో పాటు వాటిని పరిష్కరించుకోవాలని సూచింది. కాబట్టి మేము కొత్తగా కొనుగోలు చేసిన బస్సులన్నింటిని తిరిగి టాటా మోటార్ వారికే పంపదలచాము.

ఆ బస్సులలో లోపాలను సరిచేయడం పూర్తయిన తరువాత తిరిగి సిఐఆర్టి బృందం తనిఖీ చేస్తుంది. తరువాత వారు ఇచ్చే నివేదికను బట్టి బస్సులను నడపడానికి అనుమతివ్వడం జరుగుతుంది అని వివరంగా తెలియజేసారు.

ఇక్కడ ఆసక్తికరమైన ఒక విషయం ఏమిటంటే టాటా మోటార్స్ తయారు చేసిన అదే బస్సులను ఉత్తరప్రదేశ్ మరియు హిమాచల్ ప్రదేశ్ రవాణా సంస్థలు కూడా కొనుగోలు చేయడం జరిగింది. కానీ వాటిలో ఎటువంటి లోపాలు లేవని ఆ రాష్ట్ర ప్రభుత్వం వారు వాటిని రవాణా వ్యవస్థలో ఉపయోగించుకుంటున్నారు.

ఇంకా ఈ ఏడాది చివరికల్లా 300 బస్సులను కొనుగోలు చేస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశలో సుమారు 150 బస్సులను యుటిసి ప్రభుత్వం రవాణా వ్యవస్థలో చేర్చింది. రవాణా వ్యవస్థలో చేర్చిన 150 బస్సులలో డెహ్రాడూన్ డిపో నుండి 50, కుమావున్ ప్రాంతం నుండి 65, తనక్పూర్ డిపో నుండి 35 బస్సులు నడుస్తున్నాయి అని తెలియజేసారు.

ఇవేకాకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యశ్పాల్ ఆర్య అక్టోబర్ నెలలో హల్ద్వానీ నుండి 20 కొత్త బస్సులను కూడా ప్రారంభించారు.
Read More:2020 సుజుకి హయాబుసా విడుదల: ధర రూ. 13.75 లక్షలు

ఏది ఏమైనా బస్సులు రహదారిపై ప్రయాణించేటప్పుడు అవాంతరాలు మొదలైతే, ప్రతిరోజు అనేక లక్షల నష్టాన్ని భరించాల్సి వస్తుందని ఆ రాష్ట్ర రవాణా వ్యవస్థ తెలియజేసింది. అందువల్ల కొత్తగా కొనుగోలు చేసిన బస్సులను తిరిగి ఇవ్వడానికి నిర్ణయించుకున్నామని కూడా తెలియజేసింది.


Click it and Unblock the Notifications








