Just In
- 1 hr ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 15 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 17 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 18 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- Finance Kotak Mahindra Bank: కొంపముంచి కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మీకు తెలుసా.. రోడ్డుపై ఇలా చేస్తే కూడా తప్పదు భారీ జరిమానా
భారతదేశంలో రోజు రోజుకి కొత్త చట్టాలు, కొత్త నియమాలు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగానే పరిశుభ్రతను కాపాడటానికి ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. దీనికోసం ఉత్తర ప్రదేశ్ కేబినెట్ ఒక నియమాన్ని ఆమోదించింది. ఈ నిబంధన ప్రకారం వాహనాల్లో ప్రయాణించే వారు రోడ్డు మీద ఉమ్మివేస్తే భారీ జరిమానా విధించబడుతుంది.
దేశవ్యాప్తంగా పరిశుభ్రతను కాపాడుకోవడానికి ఉత్తరప్రదేశ్ తొలి అడుగులు వేసింది. దీని ప్రకారం రహదారుల శుభ్రతను పెంపొందించడానికి ఈ నిబంధనను అమలు చేయడం వెనుక ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కారు డ్రైవర్లు రోడ్డుపై ఉమ్మివేయడంతో రోడ్ క్లీనప్ మరింత దిగజారిపోతోందని ఒక నివేదిక పేర్కొంది.
రోడ్డుపై వాహనదారులు ఉమ్మివేయడం వల్ల మరకలు ఏర్పడుతున్నాయి. వీటిని శుభ్రం చేసిన తరువాత కూడా ఉమ్మి మరకలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేసిన నిబంధనల ప్రకారం రహదారిపై ఉమ్మివేస్తే వారికి 1000 రూపాయల జరిమానా విధించబడుతుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
MOST READ:కొత్త వెహికల్ స్క్రాపింగ్ పాలసీతో మీ పాత వాహనాలపై పన్నుల బాదుడు ఖాయం!
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలను ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఉత్తర భారతదేశంలో కూడా కొన్ని నగరాలు ఆహ్వానించాయి. కాలుష్యాన్ని వీలైనంత వరకు రూపుమాపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందని, అందుకే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామని ఆయన అన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రాష్ట్రంలో వాహన పరిశోధన మరియు పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఏది ఏమైనా రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వాహన వేడకలు పెరగనున్నాయి. దీనితో కాలుష్య ఉద్గారాలు తగ్గుతాయి, తద్వారా వాతావరణ కాలుష్యం కూడా దెబ్బతినే అవకాశం ఉండదు.
MOST READ:తనకు తానుగా కదిలిన బైక్.. బహుశా ఇది దెయ్యం పనేనా.. అయితే వీడియో చూడండి
ఇటీవల 2021 మరియు 2022 కేంద్ర బడ్జెట్ ప్రకటించిన నిర్మల సీతారామన్ ఇందులో వెహికల్ స్క్రాపింగ్ విధానం కూడా చేర్చింది. ఈ విధానం ప్రకారం, ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేసే వాహనాలు రోడ్డుపైకి అనుమతించబడవు.
ఈ కొత్త స్క్రాపింగ్ విధానం ప్రకారం 20 సంవత్సరాల వయస్సు గల ప్రైవేట్ వాహనాలు మరియు 15 సంవత్సరాల వాణిజ్య వాహనాలు స్క్రాప్ చేయబడతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకారం, దేశంలో 10 మిలియన్లకు పైగా వాహనాలు స్క్రాప్ చేయబడ్డాయి.
MOST READ:కవాసకి బైక్లపై ఊహకందని ఆఫర్లు, దేనిపై ఎంతో ఇప్పుడే చూడండి
పాత వాహనాలు కొత్త వాహనాల కంటే 12 నుంచి13 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. అదనంగా, ఈ వాహనాలు ఎక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తాయని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వాహనాలను స్క్రాప్ చేస్తే ఇంధన వినియోగం తగ్గుతుంది. అదనంగా, ఇంధన దిగుమతుల మొత్తాన్ని తగ్గించవచ్చు. ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసే పనిలో ఉంది.