Just In
- 1 hr ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 1 hr ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
- 15 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 15 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
Don't Miss
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Movies విశ్వంభరలో ‘పాత చిరంజీవి’.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే ఈ మూవీ హిట్టే!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హెల్మెట్ ధరించలేదని నుదుటిపై బైక్ కీ తో పొడిచిన పోలీస్, తర్వాత ఏం జరిగిందంటే
భారతదేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. వాహనదారులు సరైన ట్రాఫిక్ నిబంధనలను పాటించకపోవడం వల్ల మాత్రమే కాకుండా హెల్మెట్స్ ధరించకపోవడం వల్ల సీట్ బెల్ట్ ధరించకపోవడం వల్ల, మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరుగుతూ ఉంటాయి.
ట్రాఫిక్ నియమాలను సరిగ్గా పాటించని వాహనదారులపై పోలీసులు కఠినమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. కొన్ని సార్లు వాహనదారులపై పోలీసులు కొంత దురుసుగా కూడా ప్రవర్తిస్తారు.
ఇటీవల ఉత్తరాఖండ్ లో ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. హెల్మెట్ ధరించనందుకు వాహనదారుని నుదిటిపై పోలీసులు కీని నెట్టారు. వాహనదారుని పట్ల ఈ విధంగా ప్రవర్తించినందుకు ఉత్తరాఖండ్ పోలీసుల సిటీ పెట్రోల్ యూనిట్ (సిపియు) లోని ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు.
MOST READ:రోల్స్ రాయిస్ కార్లపై ఉన్న అతిపెద్ద అపోహలు ఇవే
ఈ సంఘటన ఉత్తరాఖండ్లోని ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్ నగరంలో ఈ సంఘటన జరిగింది. సోమవారం సాయంత్రం 8 గంటలకు ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు పోలీసు సిబ్బంది ఆ వ్యక్తిని రుద్రపూర్ ప్రాంతంలో ఆపారు. వారి మధ్య వాగ్వాదం చెలరేగడంతో, సిబ్బందిలో ఒకరు ఆ వ్యక్తి యొక్క బైక్ కీని తీసుకొని అతని నుదిటిపై పొడిచారు.
పోలీసు కీతో నుదుటిపై పొడిచినప్పుడు బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక్కడ వీడియోలో బాధితుడి అతని నుదుటిపై రక్తం కారుతూ ఒక కీతో నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. ఈ సంఘటనపై ఆగ్రహించిన స్థానికులు రుద్రపూర్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసి రాళ్ళు రువ్వారు.
MOST READ:కియా మోటార్స్ యొక్క చీప్ అండ్ బెస్ట్ ఎలక్ట్రిక్ కార్
రుద్రాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజ్కుమార్ తుక్రాల్ సంఘటన స్థలానికి చేరుకుని తన నియోజకవర్గం నుంచి సిపియును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు కనీస నియమాలను పాటించడం తప్పని సరి. ఎందుకంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సమయంలో వాహనదారులు కూడా హెల్మెట్ ధరించడం వంటివి పాటించాలి. అప్పుడే రోడ్డు ప్రమాదాల నుంచి కొంత వరకు బయటపడే అవకాశం ఉంటుంది.
MOST READ:వ్యవసాయ పనుల్లో కాడెద్దులుగా మారిన అక్కా చెల్లెలు ; చలించిపోయి ట్రాక్టర్ ఇచ్చిన సోనూ సూద్