జూలై 7న విజయవాడ- చెన్నై వందే భారత్ ట్రైన్ ప్రారంభం.. సూపర్ ఫాస్ట్ ప్రయాణం!!

భారతీయ రైల్వే రంగంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సరికొత్త విప్లవంగా మారింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ పలు మార్గాల్లో ఈ సెమీ హై స్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ప్రారంభించారు. ఈ నెల 7 న మరో కొత్త మార్గంలో వందే భారత్‌ రైలు ప్రారంభం కానుంది. వివరాల్లోకి వెళితే..

జూలై 7న చెన్నై - విజయవాడ మార్గంలో కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నెల 8 నుంచి ఈ రైలు వినియోగానికి అందుబాటులోకి రానుంది. రైల్వే కనెక్టివిటీ కోసం గణనీయమైన అభివృద్ధి దిశగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ మరియు చెన్నై మధ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.

Vande-Bharat-Express

ఇప్పటికే తమిళనాడులో రెండు వందేభారత్‌ రైళ్లు నడుస్తుండగా.. ఆ రాష్ట్రానికి మూడో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించారు. సాధారణంగా చెన్నై ICFలో తయారు చేయబడిన వందే భారత్ రైళ్లను భారతీయ రైల్వేలకు అప్పగిస్తారు. వీటిని భారతీయ రైల్వే ప్రతి రైల్వే డివిజన్‌కు కేటాయిస్తుంది. దీని ప్రకారం ఈ రైలును దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించారు.

ఈ రైలును విజయవాడ నుంచి రేణికుంట మీదుగా చెన్నైకి నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. విజయవాడ నుంచి రేణికుంట మీదుగా వందే భారత్‌ను నడపడం ద్వారా తిరుపతి ప్రయాణికులు ఈ రైలును ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. అందుకే చెన్నై - విజయవాడ మధ్య ఈ సెమీ హై స్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించనున్నారు.

ఆ నేపథ్యంలో జూలై 7న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించే అవకాశం. ఆ మరుసటి రోజు నుంచి ప్రజల వినియోగానికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఈ చెన్నై - విజయవాడ రైలు గూడూరు, రేణికుంట మరియు కాట్పాడి స్టేషన్లలో ఆగుతుంది. తద్వారా విజయవాడ నుంచి తిరుపతికి వచ్చేవారు, చెన్నై నుంచి తిరుపతి వెళ్లే వారు ఈ రైలును వినియోగించుకోవచ్చు. తద్వారా చెన్నై నుంచి తిరుపతికి త్వరగా చేరుకోవచ్చు.

ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చెన్నై నుంచి విజయవాడకు మరియు విజయవాడ నుంచి చెన్నైకి కేవలం 6.5 గంటల్లో ప్రయాణించేలా ప్రణాళిక చేయబడింది. ఈ రైలు ప్రయాణ సమయం మరియు టిక్కెట్ ఛార్జీలతో సహా సమాచారం త్వరలో విడుదల కానున్నట్లు సమాచారం. దీని కోసం ఆన్‌లైన్ బుకింగ్ కూడా రేపటి నుంచి ప్రారంభం కానుంది.

ప్రస్తుతం, వందేభారత్ రైళ్లు ఇప్పటికే విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య అదే విధంగా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్నాయి. విజయవాడ మరియు తిరుపతి మధ్య ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు రేణిగుంట జంక్షన్ మీదుగా కొత్త రైలును నడపాలని ప్రతిపాదించారు.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ద్వారా ప్రయాణీకులు మెరుగైన వేగం, సామర్థ్యం మరియు సౌలభ్యంతో విశేషమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు మెరుగైన కనెక్టివిటీ ద్వారా ఈ కొత్త రైలు సర్వీస్ విజయవాడ - చెన్నై మార్గంలో ప్రయాణీకులకు మంచి అనుభూతిని అందించడానికి సిద్ధంగా ఉంది.

లక్నో, అయోధ్య మరియు గోరఖ్‌పూర్‌లను కలుపుతూ మరో వందే భారత్ రైలు కూడా జూలై 7న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీని ద్వారా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా దేశంలో రైల్వే కనెక్టివిటీపై కేంద్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని చెప్పవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 5, 2023, 14:56 [IST]
English summary
Vande bharat express from vijayawada to chennai checkout the details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+