Just In
- 7 min ago ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 2 hrs ago క్రాష్ టెస్ట్లో హోండా అమేజ్కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- 16 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 17 hrs ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
Don't Miss
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Movies అతడితో 8 నెలల డేటింగ్.. వారం గ్యాప్ వస్తే.. అఫైర్ గురించి టీవీ నటి నవ్య
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
బైకుపై బాబు చేసిన విన్యాసాలకు పోలీసులు ఇలా ట్రీట్మెంట్ ఇచ్చారు
ప్రపంచంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న మరియు జరిగే దేశాల జాబితాలో ఇండియా ఒకటి. మన దేశంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకుని కూర్చున్నాయి. ఇందులో భాగంగానే కఠినమైన నిబంధణలను కూడా అమలులోకి తీసుకు వచ్చాయి. అయితే ఇప్పటికి కూడా వాహన వినియోగదారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇందులో ఒక బైకర్ తన బైకుపై కూర్చుని, రెండు కాళ్ళు ఒకేవైపు పెట్టుకుని, ఒకే చేతితో రైడింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో ఆ బైక్ రైడర్ హెల్మెట్ కూడా ధరించలేదు. ఈ వీడియోను దుర్గ్ పోలీసులు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.
ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే ఆ బైక్ మీద కూర్చున్న వ్యక్తి ఎదో వీడియోకి ఫోజులిస్తున్నట్లు, రోడ్డుపైన వెళ్తున్న వాహనాలను కూడా పెద్దగా పట్టించుకోకుండా.. దర్జాగా ముందుకు వెళ్తున్నాడు. అతని ముందు వైపు ఒక ఆటో వెళ్తోంది, అదే సమయంలో రోడ్డుకి పక్కన లారీలు కూడా పార్క్ చేయి ఉన్నాయి.
అంతే కాకుండా ఆ బైక్ రైడర్ భుజానికి బ్యాగ్ కూడా ఉంది, అదే సమయంలో బైక్ లో అమర్చుకున్న మొబైల్ చూస్తూ రైడ్ చేస్తున్నాడు. ఈ వీడియోని ఆ బైక్ రైడర్ వెనుక ఉన్న ఒక వ్యక్తి చిత్రీకరించారు. ఈ వీడియో కాస్త పోలీసుల దృష్టిలో పడింది.
ఈ వీడియో చూసిన దుర్గ్ పోలీసులు ఆ బైక్ రైడర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి, అతనికి రోడ్డుపైన అంత నిర్లక్యంగా వ్యవహరించినందుకు రూ. 4,200 జరిమానా విధించారు. అంతే కాకూండా మళ్ళీ ఆవిధంగా చేయను అంటూ అతడు చేసిన పనికి క్షమాపణలు కూడా చెప్పాడు. అదే సమయంలో అతడు క్షమాపణలు చెబుతూ చెవులను పట్టుకున్న చిత్రాలు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు.
ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతే కాకూండా ఇంత తక్కువ సమయంలో పోలీసులు ఆ వ్యక్తిపైన చర్యలు తీసుకోవడం నిజంగానే అభినందనీయం అంటున్నారు. కొంతమంది అతని రైడింగ్ నైపుణ్యాలను ప్రశంసిస్తున్నారు.
నిజానికి భారతదేశంలో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతిరోజూ వందలాది రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. ఇందులో నిర్లక్ష్యపు రైడింగ్/డ్రైవింగ్ మరింత ప్రమాదం. ఇది కేవలం ఆ వ్యక్తికి మాత్రమే కాకుండా అతని చుట్టూ ఉన్న వారికి కూడా ప్రమాదాన్ని తీసుకువస్తుంది.
▪️स्टंटबाज, मोडिफाइड साइलेंसर, रैश ड्राइविंग करने वालों के विरुद्ध लगातार दुर्ग पुलिस के द्वारा कार्यवाही की जा रही है।
— Durg Police (PoliceDurg) September 24, 2022
▪️ कृपया यातायात के नियमों का पालन करें।
▪️यातायात पुलिस व्हाट्सएप हेल्पलाइन नंबर 94791-92029।SadakSuraksha#trafficpolicedurg #Durgpolice pic.twitter.com/5KBTs0ED2R
రోడ్డు ప్రామాదాలను తగ్గించడానికి ప్రభుత్వాలు నిబంధనలను మరింత కఠినం చేస్తోంది. హెల్మెట్ ధరించకపోతే భారీ జరిమానాలు విధిస్తోంది. మితిమీరిన వేగానికి కూడా కఠినమైన శిక్షలు విధిస్తోంది. అయినప్పటికీ చాలామంది తమ తీరుని మార్చుకోవడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదాలు రానున్న రోజులలో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
ఛత్తీస్గఢ్ జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియావైలో చాలా వైరల్ అవుతోంది. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిపైన పోలీసులు చర్యలు తీసుకోవడం అభినందనీయం. పోలీసులు ఈ విధంగా వెంటనే చర్యలు తీసుకుంటే మిగిలినవారికి తప్పకుండా భయం కలుగుతుంది. అయినప్పటికీ వాహన వినియోగదారులు కనీస జ్ఞానంతో వ్యవహరించాలి, లేకుంటే అనుకోను ప్రమాదాలు జరుగుతాయి.