మాస్క్ వాడకంపై BBMP కొత్త రూల్స్.. ఏంటో తెలుసా..?
కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా ప్రతి ఒక్కరూ సామజిక దూరాన్ని పాటించడంతో పాటు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్న నిబంధన ఉంది. కానీ ఇటీవల కాలంలో కరోనా లాక్ డౌన్ సడలించిన తరువాత కారులో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని కొంతమంది తెలిపారు. కాని బిబిఎంపి మాస్క్ ధరించే నియమాన్ని మార్చింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.

మీరు కారులో లేదా బైక్లో ఒంటరిగా ఉన్నప్పుడు మాస్క్ ధరించాలా వద్దా..? అని సందేహం వస్తుంది, కానీ ఎవరికైనా బిబిఎంపి తప్పనిసరి మాస్క్ ఉండాలని జారీ చేసినట్లు సమాచారం. మీరు కారులో ఉన్న ఏకైక వ్యక్తి అయితే మాస్క్ కచ్చితంగా ధరించాలని లేదు, జరిమానా నుంచి మినహాయింపు ఉంటుంది. అదే విధంగా బైక్ పై ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు మాస్క్ తప్పనిసరి, ఒక వేళా ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లైతే జరిమానా విధించబడుతుంది.

5 ఏళ్లలోపు పిల్లలు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. అయితే, 5 ఏళ్లు పైబడిన వారు మాస్క్ తప్పనిసరిగా ఉపయోగించాలని బిబిఎంపి కమిషనర్ మంజునాథ ప్రసాద్ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాస్క్ ధరించడానికి ఇబ్బంది ఉండవచ్చు. కానీ సంవత్సరానికి పైబడిన వారు మాస్క్ ధరించడం తప్పనిసరి.

మాస్క్ ధరించకుండా ఎక్కడెక్కడ ఉండవచ్చు :
రెస్టారెంట్లు మరియు హోటళ్లలో తినేటప్పుడు మరియు త్రాగేటప్పుడు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా, ఈత కొట్టేటప్పుడు మాస్క్ అవసరం లేదు. సెలూన్, రెస్టారెంట్ మరియు బార్తో సహా మరెక్కడైనా సిబ్బంది మాస్క్ ధరించడం తప్పనిసరి.

కానీ పార్కుల్లో జాగింగ్ చేసేటప్పుడు లేదా నడుస్తున్నప్పుడు మాస్క్ ధరించడం ఎంతైనా అవసరం. అంతే కాకుండా ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు నిలబడి ఉన్నప్పుడు కూడా మాస్క్ ధరించడం తప్పనిసరి అని బిబిఎంపి కమిషనర్ అన్నారు.

కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, జాగింగ్ చేసేటప్పుడు మాస్క్ ధరించకూడదు. ఈ రోజుల్లో కారులో ఉన్న చాలా మంది ప్రజలు మాస్క్ ధరించకుండా ప్రయాణిస్తున్నారు. కానీ మాస్క్ ఇకపై కారులో ఒంటరిగా ఉన్నవారు ధరించాల్సిన అవసరం లేదు.

జరిమానా గురించి ప్రజలకు మరియు బిబిఎంపి మార్షల్స్ మధ్య రోజువారీ వాగ్వివాదం ఉంది. ఈ కేసులో బిబిఎం కొత్త నిబంధనలు జారీ చేసింది.

కరోనా ఇన్ఫెక్షన్ నియంత్రణ కోసం మాస్క్ ఉపయోగించడం గురించి అవగాహన పెంచడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని బిబిఎంపిని ఆదేశించారు. ఇది ప్రజలలో కరోనా గురించి మరింత అవగాహన కల్పించడానికి దోహదపడుతుంది.కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందటానికి మానవతుకూడా సహకారం అందించాలి. అప్పుడే ఈ మహమ్మారిని పూర్తిగా పారద్రోలవచ్చు.
Note: Images are use for representative purpose only.


Click it and Unblock the Notifications