Reel on Car Bonnet ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం కారు బానెట్పై పడుకుని యువతి ఫోజులు.. పోలీసులు ఏం చేశారో తెలుసా?
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కొందరు విచిత్రకరమైన విన్యాసాలకు పాల్పడుతుంటారు. రోడ్డుపై వెళ్తూ వాహనాలపై సాహసోపేతమైన చర్యలకు దిగుతున్నారు. ఇటీవల స్కూటర్లపై వెళ్తూ బకెట్లో నీళ్లతో స్నానం చేసిన వీడియోలు వైరల్ కాగా.. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ యువతి చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా జనాలను ఎంతగానో ప్రభావితం చేస్తుండటంతో ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారు. లైకులు, షేర్ల కోసం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల ఆగ్రహానికి గురవుతున్నారు. చివరకు జరిమానా కట్టి తప్పును సరిచేసుకుంటున్నారు. యూపీలో ఓ యువతి నడిరోడ్డు మీద కారుపై కూర్చొని హల్చల్ చేసింది.

ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్కు చెందిన ఓ యువతి వధువు గెటప్లో టాటా సఫారీ స్మార్ట్ కారు బానెట్పై కూర్చొని ప్రధాన రహదారిపై హల్ చల్ చేసింది. ఓ బాలీవుడ్ పాటకు పోజులిస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్ చేసింది. పెళ్లి కూతురిలా అలంకరించుకుని ఈ వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీసులు ఆమెకు ఝలక్ ఇచ్చారు.
రహదారిపై తోటి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ యువతి ఇలా చేయడం వల్ల వాహనాల రాకపోకలపై ప్రభావం పడింది. కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. మరికొందరు ఆ వింతను చూడటానికి తమ వాహనాలను నిలిపి చూస్తున్నారు. దీంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో మండిపడ్డ పోలీసులు ఆమెకు చలానా విధించారు.
పోలీసులు ఆమెకు రూ. 15,500 జరిమానా విధించారు. కాగా ఆమె చేసిన ట్రాఫిక్ సమస్యతో పాటు, తన ప్రాణాలే కాకుండా ఇతర ప్రాణాలను కూడా పణంగా పెట్టేలా ఉంది. కానీ ఏ సెక్షన్లపై పోలీసులు ఈమెకు ఫైన్ విధించారో స్పష్టంగా తెలుపలేదు. ఏదేమైనా సోషల్ మీడియాలో క్రేజ్ కోసం యువతి చేసిన పని వాహనదారులకు ఇబ్బందిగా మారింది.
ఇటీవల మరో సందర్భంలోనూ ఓ యువతి ఇలాంటి వింత చేష్టలకు పాల్పడింది. అయోధ్యకు చెందిన ఓ మహిళ తన మారుతి సుజుకి డిజైర్ బానెట్పై కూర్చుంది. ఆ సమయంలో కారు వేగంగా వెళ్తోంది. మరో యువతి అదే కారులోంచి బయటికి చూస్తోంది. ఇది ప్రమాదానికి దారి తీస్తుందనడంలో సందేహం లేదు. పోలీసులు వారిద్దరికి రూ. 18000 జరిమానా విధించారు.
చాలా మెట్రోపాలిటన్ నగరాల్లో, ఇప్పుడు CCTV నెట్వర్క్ సమగ్రంగా పనిచేస్తోంది. దీనిని పోలీసు సిబ్బంది బృందం నిశితంగా నిరంతరం పర్యవేక్షిస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ట్రాక్ చేయడం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించడంలో ఈ కెమెరాలు సహాయపడతాయి. తదనుగుణంగా సంబంధిత చలాన్లు జారీ చేయబడతాయి.
ఇటీవలి కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానాల మొత్తాన్ని పెంచేందుకు ప్రభుత్వం, అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న లక్ష్యం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించకుండా ప్రజలను నిరోధించడమే. అంతేకాకుండా ప్రతి ఒక్కరికీ రహదారులపై సురక్షిత ప్రయాణాన్ని అందించడం. ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.
భారతదేశం ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాలను ఎదుర్కొంటోంది, ముఖ్యంగా ప్రాణాంతక ప్రమాదాల నిష్పత్తి ఇక్కడ ఎక్కువగా ఉంది. నిర్లక్ష్యపు డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకపోవడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నిఘా వ్యవస్థల అమలు రహదారులపై ప్రమాదకరమైన విన్యాసాలలో పాల్గొనే వ్యక్తుల సంఖ్యను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది.
అదనంగా, రియర్వ్యూ అద్దాలు లేని లేదా వాటిని సరిగ్గా ఉపయోగించని వాహనాలపై పోలీసులు అణిచివేత ప్రారంభించారు. ఉదాహరణకు హైదరాబాద్లో అద్దాలు పెట్టుకోని ద్విచక్ర వాహనదారులకు పోలీసులు చలాన్లు జారీ చేయడం ప్రారంభించారు. ఇలాంటి చర్యలు సమీప భవిష్యత్తులో ఇతర నగరాల్లో పోలీసులు అమలు చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








