Just In
- 54 min ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- 14 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 16 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 17 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
Don't Miss
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నడి రోడ్డుపై పోలీస్ చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా
ఒక మహిళ ట్రాఫిక్ పోలీసు చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యింది. ట్రాఫిక్ పోలీస్ తన కంటే చాలా పెద్దవాడైనప్పటికీ, ఆ మహిళ నడిరోడ్డులో ప్రజల ముందు చెంపదెబ్బ కొట్టింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
ట్రాఫిక్ పోలీసులు అశ్లీలమైన మాటలతో తనని అవమానించినందుకు తాను అలా చేస్తున్నానని ఆ మహిళ తన పొరుగువారికి తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళపై మాత్రమే కేసు నమోదు చేశారు. అశ్లీలమైన భాషను ఉపయోగించినందుకు పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోని పోలీసులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సంఘటన అక్టోబర్ 23 న ముంబైలో జరిగింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా ఉంది మరియు ఈ సంఘటన గురించి బయటి ప్రపంచానికి తెలియజేస్తుంది. వీడియోలో పోలీసులను కొట్టిన మహిళ ముంబైలోని మసీదు బందర్కు చెందిన 30 ఏళ్ల సాత్విక తివారీగా గుర్తించబడింది.
MOST READ:ఫెస్టివెల్ సీజన్లో రికార్డ్ స్థాయిలో మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు
అక్టోబర్ 23 న, సాత్విక తివారీ హెల్మెట్ మరియు ఫేస్ మాస్క్ ధరించకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు రోడ్డుపై ఉన్న ట్రాఫిక్ పోలీసు ఏక్నాథ్ బర్డే ఆమెను ఆపాడు. ఏక్నాథ్ బార్డే మరియు సాత్విక తివారీల మధ్య మాటల వాగ్వాదం జరిగింది. ఏక్నాథ్ బార్డే వాగ్వివాదం సమయంలో ఆ మహిళను అశ్లీల పదాలతో వేధించాడు.
దీనితో ఆగ్రహించిన సాత్విక తివారీ, పోలీసు అని కూడా చూడకుండా ఏక్నాథ్ బర్డేపై చెంపదెబ్బ కొట్టింది. ఈ సంఘటనను అక్కడికక్కడే ప్రజలు మొబైల్లో రికార్డ్ చేశారు.
MOST READ:ఎలక్ట్రిక్ వాహనాన్ని డ్రైవ్ చేసిన మైనర్ బాలుడు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా ?
ఈ సంఘటన గురించి కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకున్నప్పటికీ ఆమె కోపాన్ని తగ్గించడానికి ప్రజలు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పోలీసులు కూడా ఆమె కోపం తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. సాత్విక తివారీ ఆ పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగింది.
ఈ సంఘటన వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువయ్యింది. ట్రాఫిక్ పోలీసులు ఏక్నాథ్ బర్డే, సాత్విక తివారీలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదుపై సాత్విక తివారీపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
MOST READ:6,413 టాటా ఏస్ వాహనాలను కొనుగోలు చేయనున్న జగన్ ప్రభుత్వం.. ఎందుకో తెలుసా?
అయితే మహిళను నిర్లక్ష్యంగా వేధించిన ట్రాఫిక్ పోలీసులపై కేసు నమోదు చేయలేదు. ఈ కారణంగా, సాత్విక తివారీ కూడా పోలీస్ స్టేషన్లో గొడవపడింది. సాత్విక తివారీపై ఐపిసి సెక్షన్ 571/2020, 353, 332, 504, 506, 34 కింద కేసు నమోదైంది. ఇవి చాలా తీవ్రమైన కేసులు. ఈ నేరాలకు పాల్పడినట్లయితే, ఆమెకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించవచ్చు. కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.
ఈ సంఘటనలో పోలీసులు పక్షపాతంతో వ్యవహరించారని తెలిసింది. ముంబై కోర్టు ఇటీవల ఒక మహిళా జోమాటో ఉద్యోగికి ఇలాంటి శిక్ష విధించింది. మరో మహిళను ఇప్పుడు ముంబైలో అరెస్టు చేశారు. ఈ రెండు సంఘటనలు ముంబైలో గత రెండు నెలలుగా జరిగాయి.
MOST READ:మీకు తెలుసా.. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం ఇదే