మణిపూర్లో ప్రపంచంలో కెల్లా ఎత్తయిన రైల్ బ్రిడ్జ్
ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ మనదేశంలో ఏర్పాటు కాబోతోంది. నార్త్ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వే (ఎన్ఆర్ఎఫ్) మణిపూర్లోని నోనీకి సమీపంలో 141 మీటర్ల ఎత్తు కలిగిన పిల్లర్లపై రైల్వే బ్రిడ్జ్ పనులను ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: ప్రపంచంలో కెల్లా అత్యంత సుందరమైన రైలు మార్గాలు
ప్రస్తుతం యూరప్లోని బెల్గ్రేడ్-బార్ రైల్వే లైన్పై ఉన్న మాలా రిజెకా బ్రిడ్జ్ ప్రపంచంలో కెల్లా అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్గా ఉంది. దీని పిల్లర్ ఎత్తు 139 మీటర్లు. కాగా.. మణిపూర్లో ఏర్పాటు కానున్న రైల్వే బ్రిడ్జ్ ఈ రికార్డును బ్రేక్ చేయనుంది.
ఇది కూడా చదవండి: భారతదేశంలో కెల్లా అతిపొడవైన రైలు సొరంగ మార్గం
మణిపూర్ క్యాపిటల్ను కనెక్ట్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్న 111 కిలోమీటర్ల జిరిబం-తుపుల్-ఇంఫాల్ రైల్వే లైన్లో భాగంగా ఈ బ్రిడ్జ్ ఏర్పాటు చేయనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని చెనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ రైల్వే బ్రిడ్జ్ ఓ ఆర్చ్ టైప్ బ్రిడ్జ్. బ్రిడ్జ్పై నుంచి నదిలోకి దాదాపు 360 మీటర్ల లోతు ఉంటుంది.



Click it and Unblock the Notifications








