Just In
- 48 min ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 59 min ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 1 hr ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 2 hrs ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- Movies
రిలీజ్కు ముందే లీకైన ‘రాధే శ్యామ్’ స్టోరీ లైన్: అసలు కథ అప్పుడే మొదలు.. ప్రభాస్ అలా పూజా ఇలా!
- News
COVID-19: ముంబాయి, ఢిల్లీని ఐటి హబ్ బీట్ చేస్తోందా ? కరోనా కాటు, ఇక హోటల్స్ దిక్కు !
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Sports
IPL 2021: టఫ్ ఫైట్: ఎదురుగా ఉన్నది ఏనుగు..సన్రైజర్స్ పరిస్థితేంటీ? ప్రిడిక్షన్స్ ఇవీ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!
కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావచ్చు. తాజాగా, ఓ యువకుడు తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు అతడ్ని చిక్కుల్లో పడేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

సెల్ఫీలు తీసుకున్నందుకు కొంతమంది యువకులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో జరిగింది. పోలీసులు సదరు యువకులపై కేసు నమోదు చేసి వారికి రూ.7,500 జరిమానా కూడా విధించినట్లు సమాచారం.

ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ప్రస్తుత ఆధునిక యుగంలో సెల్ఫీ అనేది సర్వసాధారణమైన అంశం. అయితే, కొందరు సెల్ఫీ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న సందర్భాలు మరియు సెల్ఫీ తీసుకునే సమయంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను కూడా మనం చూశాం.
MOST READ:భారతమార్కెట్లో 2021 మార్చి నెలలో విడుదలైన కార్లు; పూర్తి వివరాలు

తాజాగా జరిగిన సంఘటన కూడా అలాంటిదే. ఇంటర్నెట్లో
ట్రెండింగ్గా ఉండేందుకు గానూ కొందరు యువకులు చలనంలో ఉన్న కారు బానెట్పై కూర్చుని సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ప్రమాదకరమైన చర్యకు గానూ యూపీ పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

భారత మోటారు వాహన చట్టం ప్రకారం, ప్రజా రహదారులపై స్టంట్ చేయడం మరియు ప్రమాద భరితంగా వాహనాలను నడపటం శిక్షార్హమైన నేరం. ఈ నేరానికి పాల్పడినందుకు గానూ సదరు యువతపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రోడ్లపై ఇలాంటి ప్రమాదకర సందర్భాలను నివారించేందుకు పోలీసులు చాలా కఠినమైన నిఘాను పాటిస్తున్నారు.
MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?

అయినప్పటికీ, కొందరు అత్యుత్సాహంతో ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. కానీ, ఏదో ఒక సందర్భంలోనో లేక వారు చేసే చిన్నపాటి పొరపాట్ల కారణంగానో పోలీసులకు దొరికి, చిక్కుల్లో పడుతుంటారు. ఈ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన యువకులు చేసిన పొరపాటు కూడా అలాంటిదే.
సదరు యువకులు ఈ స్టంట్ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి, సదరు వీడియోని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్గా మారడంతో, అది యూపీ పోలీసుల కంటపడింది. సదరు వీడియో ఆధారంగా ముగ్గురు యువకులపై యూపీ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. స్టంట్ చేయడానికి ఉపయోగించిన కారును కూడా పోలీసులు జప్తు చేశారు.
MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ

అదనంగా, మోటారు వాహన చట్టం, ఐపిసి సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఆ వీడియోలో యువకులు తమ కాలేజీకి వెళ్లే దారిలో కారు బోనెట్ మీద కూర్చుని సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తారు. ఇందులో ఒక యువకుడు కారు నడుపుతుండగా, మిగతా ఇద్దరు యువకులు కారు బానెట్పై కూర్చుని వీడియో కోసం పోజు ఇస్తుంటారు.

అతికొద్ది సమయంలోనే ఈ వీడియో కాస్తా ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఆ వీడియోని సాక్ష్యంగా తీసుకున్న పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్పివిని సదరు యువత స్టంట్ చేయడానికి ఉపయోగించారు. ఇప్పుడు ఆ కారు పోలీసులు ఆధీనంలో ఉంది.
MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]
Image Courtesy: Sakshya News