Just In
- 7 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 8 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 9 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 10 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సరదా తీర్చిన సెల్ఫీ; యువకులకు భారీ జరిమానా!
కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లకు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి రావచ్చు. తాజాగా, ఓ యువకుడు తీసుకున్న సెల్ఫీ ఇప్పుడు అతడ్ని చిక్కుల్లో పడేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.
సెల్ఫీలు తీసుకున్నందుకు కొంతమంది యువకులపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఫిరోజాబాద్లో జరిగింది. పోలీసులు సదరు యువకులపై కేసు నమోదు చేసి వారికి రూ.7,500 జరిమానా కూడా విధించినట్లు సమాచారం.
ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ప్రస్తుత ఆధునిక యుగంలో సెల్ఫీ అనేది సర్వసాధారణమైన అంశం. అయితే, కొందరు సెల్ఫీ కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న సందర్భాలు మరియు సెల్ఫీ తీసుకునే సమయంలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలను కూడా మనం చూశాం.
MOST READ:భారతమార్కెట్లో 2021 మార్చి నెలలో విడుదలైన కార్లు; పూర్తి వివరాలు
తాజాగా జరిగిన సంఘటన కూడా అలాంటిదే. ఇంటర్నెట్లో
ట్రెండింగ్గా ఉండేందుకు గానూ కొందరు యువకులు చలనంలో ఉన్న కారు బానెట్పై కూర్చుని సెల్ఫీలు తీసుకున్నారు. ఈ ప్రమాదకరమైన చర్యకు గానూ యూపీ పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.
భారత మోటారు వాహన చట్టం ప్రకారం, ప్రజా రహదారులపై స్టంట్ చేయడం మరియు ప్రమాద భరితంగా వాహనాలను నడపటం శిక్షార్హమైన నేరం. ఈ నేరానికి పాల్పడినందుకు గానూ సదరు యువతపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రోడ్లపై ఇలాంటి ప్రమాదకర సందర్భాలను నివారించేందుకు పోలీసులు చాలా కఠినమైన నిఘాను పాటిస్తున్నారు.
MOST READ:సైకిల్ వాలా దోశకి బలే డిమాండ్ గురూ.. ఎక్కడో తెలుసా?
అయినప్పటికీ, కొందరు అత్యుత్సాహంతో ఇలాంటి చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడుతుంటారు. కానీ, ఏదో ఒక సందర్భంలోనో లేక వారు చేసే చిన్నపాటి పొరపాట్ల కారణంగానో పోలీసులకు దొరికి, చిక్కుల్లో పడుతుంటారు. ఈ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన యువకులు చేసిన పొరపాటు కూడా అలాంటిదే.
సదరు యువకులు ఈ స్టంట్ మొత్తాన్ని వీడియోలో చిత్రీకరించి, సదరు వీడియోని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్గా మారడంతో, అది యూపీ పోలీసుల కంటపడింది. సదరు వీడియో ఆధారంగా ముగ్గురు యువకులపై యూపీ పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. స్టంట్ చేయడానికి ఉపయోగించిన కారును కూడా పోలీసులు జప్తు చేశారు.
MOST READ:ఆడి క్యూ 7 లగ్జరీ కార్ కొన్న నటుడు చందు గౌడ
అదనంగా, మోటారు వాహన చట్టం, ఐపిసి సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఆ వీడియోలో యువకులు తమ కాలేజీకి వెళ్లే దారిలో కారు బోనెట్ మీద కూర్చుని సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తారు. ఇందులో ఒక యువకుడు కారు నడుపుతుండగా, మిగతా ఇద్దరు యువకులు కారు బానెట్పై కూర్చుని వీడియో కోసం పోజు ఇస్తుంటారు.
అతికొద్ది సమయంలోనే ఈ వీడియో కాస్తా ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఆ వీడియోని సాక్ష్యంగా తీసుకున్న పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు. మారుతి సుజుకి ఎర్టిగా ఎమ్పివిని సదరు యువత స్టంట్ చేయడానికి ఉపయోగించారు. ఇప్పుడు ఆ కారు పోలీసులు ఆధీనంలో ఉంది.
MOST READ:కఠినమైన రోడ్డులో కారు నడిపి అదరగొట్టిన అరుణాచల్ ప్రదేశ్ సిఎం [వీడియో]
Image Courtesy: Sakshya News