ఇప్పుడు పల్సర్ ఆరంజ్ కలర్ లో..!

ఇండియా అతిపెద్దదైన రెండవ టూవీలర్స్ తయారీ సంస్ద బజాజ్ ఈ దీపావళి కానుకగా కస్టమర్స్ కు ఆరంజ్ కలర్ పల్సర్ ను మార్కెట్ లోకి దించడానికి రంగం సిధ్దం చేసింది. ఆరంజ్ పల్సర్ 180, 220, 220యఫ్ వర్సన్స్ లో లభ్యమవుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న 150 మరియు 135ఎల్ యస్ ని కంటిన్యూ చేస్తూనే వీటితో పాటుగా ఈ ఆరంజ్ పల్సర్ ను మార్కెట్ లోకి ప్రవేశపెడుతున్నామన్నారు.
కంపెనీ ప్రెసిడెంట్ మోటార్ సైకిల్స్ విభాగం అధిపతి మాట్లాడుతూ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ లాభం పోందుతారన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పోటీని తట్టుకోవడానికి మరియు కస్టమర్స్ యొక్క కళ్శను మావైపు తిప్పుకోవడానికి ఈ ఆరంజ్ కలర్ నిప్రవేశపెడుతున్నామన్నారు. ఇది గ్యారంటీగా మంచి ట్రెండ్ ని సృష్టిస్తుందని అన్నారు. ప్రస్తుతం 180 మరియు 220 వర్సెన్స్ బైక్స్ మార్కెట్ లో ఖరీదు రూ 71,430 నుండి రూ 82,400 ఉంటుందన్నారు.


Click it and Unblock the Notifications








