స్కూటర్స్ ఇండియా ని హస్తగతంచేసుకోబోయే దిశగా మహీంద్రా అండ్ మహీంద్రా...?

మెజారిటీ వాటా ప్రభుత్వం చేతిలో ఉంటుందని, మహీంద్రా అండ్ మహీంద్రా తో పాటు రాజ్ కోట్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న త్రిచక్ర వాహన సంస్థ అతుల్ ఆటో, ఇంకా బజాజ్ ఆటో, పియాజియో లు కూడా స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ లో వాటా కోనుగోలు కు ఆసక్తి కనబరుస్తున్నాయని ఆయన అన్నారు. గురువారం ఉదయం తాము భారీపరిశ్రమలు, ప్రభుత్వ సంస్దల శాఖామంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ తో స్కూటర్స్ ఇండియాలో వాటా కోనుగోలు విషయం గురించి చర్చించినట్లు ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (వాహనాలు, వ్యనసాయసామాగ్రి విభాగం)పవన్ గోయెంకా అన్నారు. లక్నో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న స్కూటర్స్ ఇండియా 'లాంబ్రెట్టా మోడల్ స్కూటర్స్' ను ఉత్పత్తి చేసేది. నష్టాలు రావడంతో ఆ స్కూటర్స్ తయారీని ఆపివేసింది. లాంబ్రెట్టా మోడల్ స్కూటర్స్ కి పెట్టింది పేరు స్కూటర్స్ ఇండియా.


Click it and Unblock the Notifications








