స్కూటర్ల తయారీ చేపట్టాలని భావిస్తున్న యమహా

యమహా ఏంటి స్కూటర్లను తయారు చేయడమేంటి అనుకుంటున్నారా...? అదే చెబుతున్నా... భారత మార్కెట్లో స్కూటర్ల విభాగంలో పెద్దగా పోటీదారులు లేకపోవడం, మొన్నటి స్కూటర్ల విభాగంలో రారాజుగా ఉన్న బజాజ్ ఈ విభాగం నుంచి పూర్తిగా తొలగిపోవడం, మార్కెట్లో స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండటం.. ఆ పరిస్థితులన్నీ దృష్టిలో ఉంచుకొని యమహా ఈ విభాగంపై కన్నేసినట్లు తెలుస్తుంది.
ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన ఓ ఆటో ప్రదర్శనలో స్కూటర్లు తయారుచేయాలన్న తన మనసులో మాటను ఇండియా యమహా మోటార్ నేషనల్ బిజినెస్ హెడ్ పంకజ్ దూబే బయటపెట్టారు. అయితే స్కూటర్ల తయారీ ఎలా ఉంటుంది, భారత్లో ఎలాంటి మోడళ్లను ప్రవేశపెట్టాలి, వీటి ఉత్పత్తికి సంబంధించిన కాల వ్యవధి వంటి పలు అంశాలపై కంపెనీ అధ్యయనాలు చేస్తుంది. అయితే భారత్లో మాత్రం ఖచ్చితంగా స్కూటర్లను ప్రవేశపెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరి ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావాలని మనం కూడా యమహాకు ఆల్ది బెస్ట్ చెబుదామా..!!


Click it and Unblock the Notifications








