చెన్నై మార్కెట్లో భారత్ బైక్ను విడుదల చేసిన బజాజ్ ఆటో

బజాజ్ ఆటో తాజాగా.. తన కొత్త బాక్సర్ను తమిళనాడు మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కంపెనీ జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) ఆర్.చంద్రశేఖర్ మాట్లాడుతూ కొత్త బాక్సర్ 150 సీసీ బైక్ను 'భారత్ బైక్' స్థానంలో ప్రవేశపెట్టామని, వివిధ రకాల వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించడంలో భాగంగా ఈ కొత్త బైక్ను రూపొందించామని అన్నారు.
గ్రామీణ రోడ్లపై 100 సీసీ బైక్లు అంత సమర్థవంతంగా పనిచేయని నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త బైక్ను అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు. బాక్సర్ 150 సీసీ బైక్ యొక్క ఇంజన్ 12 పిఎస్ల శక్తిని మరియు 12.26 ఎన్ఎమ్ల టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తి సాధారణ 100 సీసీ బైక్తో పోల్చుకుంటే సుమారు 50 శాతం అధికం. దీని ఎక్స్-షోరూమ్ చెన్నై ధర రూ. 43,247.
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలను 100 సీసీ బైక్లే డామినేట్ చేస్తున్నాయని, అయితే తమ కొత్త భారత్ బైక్ గతుకుల రోడ్లపై ఎవరైతే సౌఖ్యమైన మరియు సురక్షితమైన ప్రయాణాన్ని కోరుకుంటారో అలాంటి వారిని ఆకట్టుకుంటుందని చంద్రశేఖర్ అన్నారు. అక్టోబర్ నెల నుండి ప్రతి నెలా సుమారు 30,000 భారత్ బైక్లను విక్రయించగలమని అంచనా వేస్తున్నామని ఆయన అన్నారు.


Click it and Unblock the Notifications








