'భారత్ బైక్'గా మార్కెట్లోకి రానున్న 150cc బజాజ్ బాక్సర్!!

దేశపు రెండవ అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారు అయిన బజాజ్ ఆటో, 150 సీసీ విభాగంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో బజాజ్ స్కూటర్లను పునఃప్రవేశపెట్టాలన్న బజాజ్ సంస్థ అధినేత రాహుల్ బజాజ్ ఆలోచనను కూడా ఆయన తనయుడు రాజీవ్ బజాజ్ పక్కనపెట్టారు. అర్బన్ మార్కెట్లలో ఎక్కువగా దర్శనమిచ్చేవి 150 సీసీ బైకులే, అలాగే రూరల్ మార్కెట్లలో 100-125సీసీ బైకులు రాజ్యమేలుతున్నాయి. ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన బజాజ్ తన కొత్త భారత్ బైక్ను రూ. 40,000 ప్రైస్ ట్యాగ్తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలోనే విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. భారత్ బైక్ మెయిన్ టార్గెట్ రూరల్ మార్కెట్లే.
తక్కువ ధరకే 150 సీసీ బైక్ లభించడం కారణంగా రూరల్ మార్కెట్లో వీటి వినియోగం పెరిగే అవకాశం ఇంది. నగరాల్లో ఎలాగో.. 150 సీసీ బైక్లంటే క్రేజ్ ఉండటం, దానికి తోడు చౌక ధరకే లభించడంతో ఈ బైక్ వినియోగం భారీగా పెరిగే సూచనలున్నాయి. "అర్బన్ ప్రాంతాల్లో అప్మార్కెట్ కస్టమర్ల కోసం దేశీయ బైక్లైన పల్సర్, డిస్కవర్ మోడళ్లు ఉన్నాయి. కానీ టూ-వీలర్ విభాగంలో చిన్న చిన్న పట్టణాలు, ప్రాంతాల్లో సౌకర్యవంతమైన, శక్తివంతమైన రవాణ సదుపాయం కోరుకునే ప్రజలు చాలా మంది ఉన్నారు. వీరి అవసరాలను తీర్చే విధంగా బాక్సర్ను డిజైన్ చేశాం" అని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ బిజినెస్ లైన్ పత్రికకు తెలిపారు. మరి భారత్ బైక్ను ఇదివరకటి బాక్సర్లా భారత ప్రజలు ఆదరిస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications








