అధునాత టెక్నాలజీ మీ కారు మరింత భద్రం..!

కంప్యూటర్ సహాయంతో మీ కారు ఇంజన్ హార్స్పవర్ను పెంచుకోవచ్చు, అంతేకాకుండా.. కారుకే నావిగేషన్తో కూడిన ఒక వైర్లెస్ టెలిఫోన్ కనెక్షన్ను కూడా అమర్చుకోవచ్చు. ఈ విధంగా కారులో నావిగేషన్ సిస్టమ్ను అమర్చడం వల్ల శాటిలైట్ వ్యవస్థ ద్వారా కారు సంబంధించిన సమాచారాన్ని ప్రతిక్షణం గమనించవచ్చు. దీని ద్వారా కారు దొంగింలిపబడే అవకాశం ఉండదు. ఒకవేళ అలా జరిగిన జిపిఎస్ సిస్టమ్ ద్వారా కారు ఎక్కడ ఉందో ఇట్టే కనిపెట్టేయవచ్చు. ఇంకా జేమ్స్ బాండ్ సినిమాల్లో మాదిరి కారులో మనిషి లేకుండానే.. మన చేతిలో కంప్యూటర్ స్క్రీన్ ఆధారంగా కారును నడపవచ్చు. బయటి వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు కార్లలో జీ-ఫోర్స్ మీటర్ను అమర్చవచ్చు.
కారుకు అమర్చబడే అధునాతన సెన్సార్ల ద్వారా ముందుగా జరగబోయే యాక్సిడెంట్లను కూడా గుర్తించి అప్రమత్తంగా ఉండవచ్చు. హెచ్చిరింపు సూచికలు (వార్నింగ్ సిగ్నల్స్), అప్రమత్త సందేశాలు (అలెర్ట్ మెసేజెస్) కూడా ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యమే. ప్రస్తుతం కంపెనీలు తాము తయారుచేయబోయే కార్లలో ఈ టెక్నాలజీని వాడేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా పరిశోధకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరి ఇది పూర్తి స్థాయిలో ఆచరణలోకి ఎప్పుడొస్తుందనేది కాలమే నిర్ణయించాలి.


Click it and Unblock the Notifications








