ఎలక్ట్రిక్ స్కూటర్లను పునఃప్రవేశపెట్టనున్న టీవీఎస్ కంపెనీ

కర్ణాటకలోని మైసూరులో ఉన్న టీవీఎస్ ఉత్పత్తి కేంద్రంలో ఈ స్కూటర్లను తయారు చేయనున్నామని ఆయన వెల్లడించారు. భారత్లో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ గురించి గోయిందిని అడుగగా ఆయన వివరిస్తూ... కొన్ని సంవత్సరాల క్రితం భారత్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉండేదని, కానీ వెరైటీలు ఎక్కువగా లేని కారణందా తర్వాతి కాలంలో వీటికి డిమాండ్ బాగా తగ్గిపోయిందని, అయితే వీటిపై ఇప్పుడు సబ్సిడీలు కూడా లభిస్తుండటంతో మరోసారి వీటికి భారీ డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు.
గత ఏప్రిల్ 2008లో టీవీఎస్ మోటార్ కంపెనీ "స్కూటీ టీన్జ్ ఎలక్ట్రిక్" అనే ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈ స్కూటర్లు ఏటా దాదాపు 40,000 వరకూ అమ్ముడుకాగలవని కంపెనీ అంచనా వేసింది. కానీ ఇది ఆశించిన రీతిలో మార్కెట్ ఆదరణ పొందలేకపోయింది. దీంతో మే 2009లో స్కూటీ టీన్జ్ ఎలక్ట్రిక్ ఉత్పత్తిని నిలిపివేసింది.


Click it and Unblock the Notifications








