గ్రామీణ ప్రాంతాల్లో మైక్రోఫైనాన్స్ ద్వారా హీరో సైకిల్స్కు ఫైనాన్సింగ్

పల్లె వాసుల నెలసరి ఆదాయం తక్కువగా ఉండటం వల్ల వారు ఒక్కసారిగా రూ. 3,000 వెచ్చించి సైకిల్ను కొనుగోలు చేయాలంటే కష్టం కాబట్టి ఈ స్కీమ్ను ప్రవేశపెట్టామని, దీని ద్వారా రుణగ్రస్తులు నెలకు/వారానికి విడతల వారీగా కొంత మొత్తాన్ని చెల్లించడం సులువుగా ఉంటుందని, వారి రోజూవారీ జీవన కార్యకలాపాలకు సైకిల్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. భారత్లో సైకిళ్ల వినియోగం భారీగా తగ్గిపోయిందని, కేవలం గ్రామీణ ప్రాంతాలనే కాకుండా.. చిన్నపిల్లలు, ప్రిమీయం సైకిళ్లను ఇష్టపడే వారిని కూడా దృష్టిలో ఉంచుకొని మరిన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పంకజ్ ముంజాల్ చెప్పారు.


Click it and Unblock the Notifications








