కొత్త శ్రేణి రిక్షాలను విడుదల చేసిన హై బర్డ్

ఈ నేపథ్యంలో మరుగున పడిపోతున్న మూడు చక్రాల సైకిల్ రిక్షాలకు పూర్వవైభవం కల్పించాలనే లక్ష్యంతో మరియు సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతిని కలిగించేలా ప్రముఖ సైకిళ్ల తయారీ సంస్థ హై బర్డ్ కొత్త శ్రేణి రిక్షాలను విడుదల చేసింది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ రిక్షాలను కంపెనీ విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,000 రిక్షాలను విక్రయించాలని హై బర్డ్ లక్ష్యంగా నిర్ణయించినట్లు కంపెనీ చైర్మన్ ఆర్డి శర్మ వెల్లడించారు.
రిక్షా లాగేవారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, రిక్షాను తొక్కేందుకు కావల్సిన శక్తిని తగ్గించేందుకు గానూ రిక్షా బరువు 30 శాతానికిపైగా తగ్గించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం సాధారణ రిక్షాల బరువు దాదాపు 100 కిలోలు ఉంటే, కొత్తగా విడుదల చేసిన రిక్షా బరువు 65-75 కిలోలు ఉంటుందని శర్మ వివరించారు. ఇంకా ప్రయాణికుల రక్షణ కోసం కార్లలో మాదిరిగా సీట్ బెల్ట్ను ప్రయాణికుల ఫుట్ రెస్ట్ కోసం ప్రత్యేక ప్లాట్ఫామ్ను ఈ రిక్షాలకు జోడించారు.
ఇక ఈ రిక్షాల ధర విషయానికి రూ. 8,500 మొదలుకొని రూ. 15,000 వరకూ ఉన్నట్లు ఆయన తెలిపారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్లు రిక్షాల పటిష్టమైన మార్కెట్లని, రెండవ విడతలో భాగంగా ఉత్తరప్రదేశ్, బీహార్, చత్తీస్ఘడ్ రాష్ట్రాలలో విడుదల చేస్తామని శర్మ తెలిపారు. ప్రస్తుతం దేశంలో రిక్ష మార్కెట్ పరిమాణం రెండు కోట్లని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా.. లుథియానాకు చెందిన ఓ కంపెనీ డయల్-ఏ-క్యాబ్ లాంటి కారు సర్వీసు మాదిరగా 'డయల్-ఏ-రిక్షా' సర్వీసులను ప్రారంభించాలని భావిస్తోంది.


Click it and Unblock the Notifications








