ఈ-బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన హై-బర్డ్ సఫారీ గ్రూప్

ఈ-బైక్లపై కేంద్రం ప్రభుత్వం అద్భుతమైన రాయితీలను, ప్రోత్సాహకాలను అందిస్తుండటంతో.. కంపెనీ ఈ-బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించిందని శర్మ వివరించారు. ఇటీవల కేంద్రం వెల్లడించిన యూనియన్ బడ్జెట్ 2011-12లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ మార్కెట్ దిగుమతి చేసుకునే బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీని పూర్తిగా మినహాయించడమే కాకుండా.. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీలో కూడా రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ-బైక్ల తయారీకి కావల్సిన ఇంజన్ మరియు ఇతర కీలక విడిభాగాలను కొరియా, తైవాన్ల నుంచి దిగుమతి చేసుకొని లుథియానాలో ఉన్న తమ ఫ్యాక్టరీలో హై-బర్డ్ అసెంబ్లింగ్ చేయనుంది. ఈ ద్విచక్ర వాహనాలు గంటకు 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో పూర్తి బ్యాటరీ ఛార్జింగ్పై 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా వీటిని రూపొందించనుంది. రెండు మోడళ్లలో విడుదల చేయబోయే వీటి ధరలు రూ. 27,000 మరియు రూ. 28,900 మధ్య ఉండనున్నట్లు ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications








