రెండేళ్లలో రెండో ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభం: హోండా

ప్రస్తుతం గ్రేటర్ నోయిడాలో ఉన్న ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడమే తమ ప్రధమ లక్ష్యమని, ఆ తర్వాతనే తపుకరా ప్లాంటులో అసెంబ్లింగ్ కార్యకలాపాలను ప్రారభించే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని, ఇందుకు మరో 2-3 ఏళ్ల సమయం పడుతుందని హోండా సియోల్ కార్స్ ఇండియా డైరెక్టర్ (మార్కెటింగ్) సెకీ ఇనాబా అన్నారు.
గ్రేటర్ నోయిడాలో రూ. 450 కోట్ల పెట్టుబడితో 1997లో హోండా తొలి ప్లాంటును ఏర్పాటు చేసింది. దీని ఉత్పత్తి సామర్థ్యం సాలీనా ఒక లక్ష యూనిట్లు. వివిధ మార్గాలలో సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా ఈ ప్లాంటులో ఏటా 1.2 లక్షల యూనిట్ల వరకూ ఉత్పత్తిని చేపట్టవచ్చునని ఆయన చెప్పారు. కాగా.. రాజస్థాన్లోని తపుకరాలో ఏర్పాటు చేసింది భారత్లో హోండా కంపెనీకు రెండవ ప్లాంటు.


Click it and Unblock the Notifications








