భారత్‌లో మూడవ ప్లాంటు పనులను ప్రారంభించిన హోండా

Honda New Plant
జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండాకు చెందిన పూర్తి భారతీయ అనుబంధ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎమ్ఎస్ఐ) భారత్ తమ మూడవ ప్లాంటు నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కర్ణాటకలోని కోలార్ వద్ద ఏర్పాటు చేస్తున్న ద్విచక్ర వాహన ప్లాంటుకు కంపెనీ గురువారం శంకుస్థాపన చేసింది.

బెంగుళూరుకు 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సాపూర్ పారిశ్రామిక ప్రాంతంలో 3,50,000 చ.మీ. విస్తీర్ణంలో సుమారు రూ.1,350 కోట్ల పెట్టుబడితో హోండా ఈ ప్లాంటును నిర్మిస్తోంది. 2013 నాటికి ఈ ప్లాంటు ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభ దశలో భాగంగా సాలీనా 12 లక్షల యూనిట్లను ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని కంపెనీ అధ్యక్షుడు, సీఈఓ కీటా మౌరమత్సు తెలిపారు.

భవిష్యత్తులో ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 18 లక్షల యూనిట్లకు పెంచుతామని, ఈ ప్లాంటు ద్వారా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం, భారత మార్కెట్లో హోండా మూడు స్కూటర్ల (ఆక్టివా, డియో, ఏవియేటర్)ను, ఆరు మోటార్‌సైకిళ్ల (సిబి ట్విస్టర్, సిబిఎఫ్ స్టన్నర్, సిబి షైన్, సిబి యునికార్న్, సిబి యునికార్న్ డాజ్లర్ మరియు సిబిఆర్ 250ఆర్)ను అందిస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, September 30, 2011, 11:49 [IST]
English summary
Japanese two-wheeler major Honda's wholly-owned Indian subsidiary Honda Motorcycle and Scooter India (HMSI), laid the foundation stone for its third two-wheeler production plant in India at Narsapur, in Karnataka.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+