భారత్లో రెండు హ్యోసంగ్ సూపర్బైక్స్ విడుదల

హ్యోసంగ్ షోరూమ్లను త్వరలో హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. తొలి ఏడాదిలో 2,000 బైక్లు విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. హ్యోసంగ్ గతం(2004)లోనే భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అయితే 2007లో హ్యోసంగ్ మోటార్ డివిజన్ను ఎస్&టి గ్రూపు కొనుగోలు చేసింది. కాగా.. ప్రస్తుతం భారత్లో ఏర్పాటు చేసిన తాజా వెంచర్ కోసం ఎస్&టి మోటార్స్ పుణేకి చెందిన గర్వారే మోటార్స్తో చేతులు కలిపి మరోసారి రీ ఎంట్రీ ఇచ్చింది. 20 కోట్ల పెట్టుబడితో గార్వారే మహారాష్ట్రలోని వాయ్ వద్ద అసెంబ్లింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం రోజుకు (సింగిల్ షిఫ్ట్లో) 8-10 బైకులు.


Click it and Unblock the Notifications








