నాలుగు కొత్త మోడళ్లతో రీ-ఎంట్రీ ఇవ్వనున్న ఎల్ఎమ్ఎల్

మరికొద్ది నెలల్లోనే కాన్పూర్ హెడ్క్వార్టర్కు చెందిన కంపెనీ భారతదేశపు తొలి 200 సీసీ ఇంజన్తో గేర్లు కలిగిన స్కూటర్ను విడుదల చేయనుంది, దీని తర్వాత మరో 125 సీసీ గేర్లు లేని స్కూటర్ను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇది సుజుకి యాక్సెస్ 125, మహీంద్రా డ్యూరో, రోడియో మరియు ఫ్లైట్ స్కూటర్లకు పోటీగా నిలువనుంది. అలాగే, ఒకప్పటి కంపెనీ ఫ్లాగ్షిప్ మోటార్సైకిల్ అయిన ఎల్ఎమ్ఎల్ ఫ్రీడమ్ బైక్ను కూడా మాస్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకొని 100 సీసీ, 125 సీసీ ఇంజన్లతో విడుదల చేయనుంది.
"2006లో సమస్యల్లో చిక్కుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు మేము విరామం తీసుకున్నామ"ని ఎల్ఎమ్ఎల్ సేల్ల్ అండ్ మార్కెటింగ్ హెడ్ పి.ఎస్. చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఎగుమతులను ప్రారంభించామని, భారత్ కోసం నాలుగు మోడళ్లతో మార్కెట్లోకి వస్తున్నామని, తమ సొంత డిజైన్ మరియు టెక్నాలజీతో వీటిని అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి ఫ్రీడమ్ బైక్ను తిరిగి ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చౌదరి చెప్పారు.


Click it and Unblock the Notifications








