స్కూటర్స్ ఇండియా వాటా కొనేందుకు మేమూ సిద్ధమే: లోహియా ఆటో

ఈ వాటలకు ప్రభుత్వం గనుక వేలం నిర్వహిస్తే తాము తప్పకుండా పాల్గొంటామని లోహియా ఆటో ఇండస్ట్రీస్ సీఈఓ ఆయుష్ లోహియా తెలిపారు. స్కూటర్స్ ఇండియా ప్రభుత్వానికి 95.38 శతాం వాటా ఉంది. మిగిలిన వాటాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కార్పొరేట్ సంస్థల వద్ద ఉంది. గడచిన 2002-03 ఆర్థిక సంవత్సరం నుంచి స్కూటర్స్ ఇండియా నష్టాల ఊబిలో కూరుకుపోయింది. మార్చి 2009లో కంపెనీ పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేసింది. బీఎస్ఈలో లిస్టయిన స్కూటర్స్ ఇండియా 2009-10 ఏడాదికి రూ. 22.03 కోట్ల నష్టాలను ప్రకటించింది.
కాగా.. స్కూటర్స్ ఇండియా లిమిటెడ్లో ప్రభుత్వ వాటాలను కొనుగోలు చేసేందుకు ఇప్పటితే రాజ్కోట్ కేంద్రంగా పనిచేస్తున్న అతుల్ ఆటో మరియు దేశీయ యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా రేసులో ఉన్నాయి. స్కూటర్స్ ఇండియా సామర్థ్యం, టెక్నాలజీలపై ఇన్వెస్ట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అతుల్ ఆటో డెరైక్టర్ విజయ్ కేడియా పేర్కొన్నారు.
స్కూటర్స్ ఇండియా హిస్టరీ..
1972లో ఇటలీ లాంబ్రెట్టా కంపెనీతో ఒప్పందం చేసుకొని విజయ సూపర్ బ్రాండ్ పేరుతో స్కూటర్లను ఉత్పత్తి చేసిన స్కూటర్స్ ఇండియా కంపెనీ విదేశాలకు కూడా స్కూటర్లను ఎగుమతి చేసింది. ఆ తర్వాతి కాలంలో సొంత టెక్నాలజీ విక్రాంత్ పేరుతో త్రిచక్ర వాహనాల (ఆటోలు) ఉత్పత్తిని చేపట్టింది. 1997 తరువాత స్కూటర్ల తయారీని పూర్తిగా నిలిపివేసి కేవలం ఆటోల ఉత్పత్తికి పరిమితమైంది. అయితే ఇందుకు కావాల్సిన సామర్ధ్యం స్కూటర్స్ ఇండియా వద్ద లేకపోవడం, దానికి తోడు పాత టెక్నాలజీల వాడటం కారణంగా కంపెనీ మార్కెట్లో నిలదొక్కులేక పోవటంతో సిక్ ఇండిస్ట్రీగా మారి దివాళా తీసింది.


Click it and Unblock the Notifications








