స్కూటర్స్ ఇండియా వాటాలపై ఆసక్తిగాలేని మహీంద్రా!

Scooters India
దివాళతీసిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ స్కూటర్స్ ఇండియాలో ప్రభుత్వానికి ఉన్న వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వాటాల కొనుగోలు రేసులో తాము లేమని దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా స్పష్టం చేసింది. ఓ కార్యక్రమంలో మహీంద్రా అండ్ మహీంద్రా అధ్యక్షుడు పవన్ గోయెంకా విలేఖరులతో మాట్లాడుతూ, స్కూటర్స్ ఇండియాపై తమ కంపెనీ దృష్టి సారిస్తున్న వార్తలను తోసిపుచ్చారు.

కేంద్ర ప్రభుత్వం స్కూటర్స్ ఇండియా వాటాలను విక్రయించాలని ప్రకటించినప్పుడు ఈ వాటాల కొనుగోలు రేసులో అతుల్ ఆటో మరియు మహీంద్రా కంపెనీలు ముందున్నట్లు కథనాలు వెలువడిన సంగతి తెలిసిందే. గడచిన 2002-03 ఆర్థిక సంవత్సరం నుంచి స్కూటర్స్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయింది. మార్చి 2009లో ఈ కంపెనీ పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేసింది. స్కూటర్స్ ఇండియాలో ప్రభుత్వానికి 95.38 శతాం వాటా ఉంది. మిగిలిన వాటాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, కార్పొరేట్ సంస్థల వద్ద ఉంది.

స్కూటర్స్ ఇండియా 1972లో ఇటలీకు చెందిన లాంబ్రెట్టా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని విజయ సూపర్‌ బ్రాండ్‌ పేరుతో స్కూటర్‌లను ఉత్పత్తి చేసిన స్కూటర్స్‌ ఇండియా కంపెనీ విదేశాలకు కూడా స్కూటర్లను ఎగుమతి చేసింది. అయితే, ఆ తర్వాతి కాలంలో స్కూటర్ల అమ్మకాలు పడిపోవడంతో తమ సొంత టెక్నాలజీ విక్రాంత్ బ్రాండ్ పేరుతో త్రిచక్ర వాహనాల (ఆటోలు) ఉత్పత్తిని చేపట్టింది. 1997 తరువాత స్కూటర్ల తయారీని పూర్తిగా నిలిపివేసి కేవలం ఆటోల ఉత్పత్తికి పరిమితమైంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 13, 2011, 17:30 [IST]
English summary
Indian auto major Mahindra and Mahindra has rules out any plans to buy defunct two wheeler firm Scooters India. Speaking to media persons during an event Mahindra and Mahindra president Pawan Goenka has denied the company was eyeing Scooters India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+