హ్యార్లీ డేవిడ్సన్ బైక్ను కొన్న రెండవ ఇండియన్ లేడీ..

అయితే, ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి మరో మహిళ చేరిపోయింది. హైదరాబాద్కు చెందిన 33 ఏళ్ల ఆర్కిటెక్ట్ కస్తూరీ డియోధర్ భారత్లో హ్యార్లీ డేవిడ్సన్ బైక్ను కొనుగోలుచేసిన రెండవ మహిళగా వార్తల్లో నిలిచారు. "మరింత మంది మహిళలు హ్యార్లీను రైడ్ చేయడానికి ఇష్టపడుతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను ఈ బైక్ను రైడ్ చేస్తున్నప్పుడు చాలా మంది ప్రజలు నన్నేచూస్తుండిపోయార"ని డియోదర్ తెలిపారు.
అమెరికాకు చెందిన ప్రముఖ కల్ట్ బైక్ల తయారీ సంస్థ అయిన హ్యార్లీ డేవిడ్సన్ భారత్ మార్కెట్లో అందిస్తున్న "ఐరన్ 883" బైక్ను డియోధర్ కొనుగోలు చేశారు. షీజా మాథ్యూస్ కూడా ఇదే మోడల్ బైక్ను కొనుగోలు చేశారు. దీని ధర రూ. 6.5 లక్షలు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. డియోధర్ భర్త ఈ బైక్ను ఆమెకు బహుమతిగా ఇచ్చారు. హ్యార్లీ డేవిడ్సన్ బైక్ వాడటానికి ముందు యమహా రాజ్ధూత్ 350 బైక్ను, దానికి ముందుకు బజాజ్ ఎలిమేనేటర్ బైక్లను ఉపయోగించే వాళ్లమని డియోధర్ తెలిపారు.


Click it and Unblock the Notifications








