తమిళనాడులో రూ. 4,000 కోట్లతో ప్యూజో సిట్రాన్ ప్లాంట్

ప్లాంటు ఏర్పాటు కోసం వివిధ రాష్ట్రాలను పరిశీలించిన కంపెనీ చివరకు తమిళనాడులోని శ్రీపెరంబూరు ప్రాంతాన్ని ఎంచుకుంది. పూర్తిగా 100 శాతం అనబంధ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 20,000 మంది ఉపాధి లభించనుంది. అంతేకాకుండా ఫ్రాన్స్ నుంచి అధిక సంఖ్యలో విడిభాగాల తయారీదారులను కూడా ఈ ప్లాంటు ఆకర్షించనుంది. పిఎస్ఏకు చెందిన ఉన్నతాధికారుల బృందం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో భేటీ అయ్యారు. తమ ప్లాంటు ఏర్పాటు కోసం తమిళనాడును ఎన్నుకుందుకు పిఎస్ఏ ఎగ్జిక్యూటివ్లకు ఆమె ధన్యవాదములు తెలిపారు. ఈ ప్రాజెక్టు తమ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications








