మహా సర్కారుపై మండిపడిన బజాజ్ ఆటో ఎండి

Rajiv Bajaj
మహారాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాల పట్ల దేశీయ ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో గుర్రుగా ఉంది. ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా తమ భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను మహారాష్ట్రలలో కాకుండా పొరుగు రాష్ట్రమైన గుజరాత్‌లో చేపట్టేందుకు కంపెనీ మొగ్గుచూపుతోంది. దీంతో సుమారు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు మహారాష్ట్రను వదలి పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోనున్నాయి.

దీనిపై బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "గుజరాత్ ప్రభుత్వంతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయించాల్సిందిగా నేను మా చైర్మన్ రాహుల్ బజాజ్‌ను కోరడం జరిగింది. ఈ భేటిలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశం ఉంది. పోర్టుకు సమీపంలో భూమి దొరికితే మేము చాలా సంతోషిస్తాము, ఇది మా ఎగుమతులకు ఎంతగానో ఉపయోగపడుతుంద"ని రాజీవ్ చెప్పారు.

మహారాష్ట్ర సర్కారు అనుసరిస్తున్న ప్రభుత్వ విధానాలపై రాజీవ్ బజాజ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 2010 నుంచి బజాజ్ ఆటో కంపెనీకు సేల్స్ టాక్స్‌ను రీఫండ్ చేయడంలో జాప్యం చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం చెల్లించాల్సిన సేల్స్ టాక్స్‌ బకాయిలు రూ. 1,110 కోట్లుకు చేరుకున్నాయి. దీనిపై 'మహా' సర్కారు ఎలాంటి స్పష్టమైన వైఖరిని ప్రకటించకపోవడంతో బజాజ్ ఆటో తన విస్తరణ ప్రాజెక్టులను వేరే రాష్ట్రానికి మళ్లించాలని భావిస్తోంది.

More from DriveSpark

Article Published On: Wednesday, July 20, 2011, 12:56 [IST]
English summary
India's second largest two-wheeler major in terms of numbers, Bajaj Auto Limited (BAL) Managing Director Rajiv Bajaj contemplating to move out from Maharashtra for their future expansion projects running into over a Rs 1,000 crore.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+