స్కూటర్స్‌ ఇండియా ప్రైవటీకరణ చేస్తున్నాం..: కేంద్ర మంత్రి

Indian Scooters
ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం మన భారత ప్రభుత్వానికి కొత్తేమి కాదు. ఈసారి కూడా భారత ప్రభుత్వం ఇలాంటి ఓ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. డీలా పడిన "స్కూటర్స్‌ ఇండియా"ను పూర్తిగా ప్రైవేట్‌ పరం చేయాలని నిర్ణయించినట్లు భారత ప్రభుత్వ భారీ పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ఇలాంటి కంపెనీలు భారీ పరిశ్రమల శాఖ ఆధీనంలో చాలానే ఉన్నప్పటికీ స్కూటర్స్‌ ఇండియా పరిస్థితి మాత్రం వేరు. కొంత మంది పెట్టుబడులు ఉపసంహరించా లంటే.. కొంత మంది మొత్తం విక్రయించాలని అంటున్నారని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ తెలిపారు.

గత ఆర్థిక సంవత్సరం (2009-10)లో కంపెనీ రూ. 22.03 కోట్ల నష్టాన్ని చవిచూసింది. దీంతో స్కూటర్స్ ఇండియాను పూర్తి స్థాయి ప్రైవేటీకరణ చేయడమే మంచిదని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూటర్స్ ఇండియాలో కేంద్ర ప్రభుత్వానికి 95.38 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ సొంతంగా ఆటో ప్లాంట్‌ను కలిగి ఉండి, సాంప్రదాయ, సాంప్రదాయేతర ఇంధన ఆధారిత త్రిచక్ర వాహనాల డిజైనింగ్, డెవలపింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, మార్కెటింగ్‌ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ కంపెనీ మూతబడి ఉంది.

More from DriveSpark

Article Published On: Saturday, February 5, 2011, 15:45 [IST]
English summary
The take over sick units in the country’s business sector is nothing new and this time the government of India comes out such an offer. The decaying Scooters India is to be privatized with the shares going for public, said the Heavy Industries of the government of India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+