రాయల్ ఎన్ఫీల్డ్ ప్లాంటు తమిళనాడు వెళ్లడానికి కారణం..?

రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాజెక్టు కల్పించాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలకు కిరణ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆమోదం తెలిపినప్పటికీ ఐషర్ ప్లాంటును రాష్ట్రం సొంతం చేసుకోలేకపోయింది. తమకు కల్పించాల్సిన రాయితీలకు సంబంధించిన ఉత్తర్వులను మార్చి నెలాఖరుగాలోగా జారీ చేయాల్సిందిగా ఐషర్ మోటార్స్ కిరణ్ సర్కారును కోరింది.
కాగా... ఈ విషయంపై మే 26వ తేదీన ప్రభుత్వం ఓ జీవోను పాస్ చేసింది. ఈ ప్రాజెక్టుకు కిరణ్ కుమార్ రెడ్డి అంగీకారం తెలిపినప్పటికీ పరిశ్రమల శాఖ నుంచి స్పందన రాకపోవడంతో చిర్రెత్తిన ఐషర్ మోటార్స్ తమిళనాడు సర్కారును ఆశ్రయించింది. ప్రస్తుతం ఐషర్ మోటార్స్కు చెన్నైలో ఉన్న ప్లాంటుకు సమీపంలోనే కొత్తగా ఈ టూ-వీలర్ ప్లాంటును ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. ఈమేరకు తమిళనాడు సర్కారు నుంచి ఆమోదాన్ని రాయితీలను కూడా పొందింది.
ఐషర్ మోటార్స్ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయదలుచుకున్న రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్కిళ్ల తయారీ ప్లాంటుకు 80 ఎకరాల భూమి మరియు 50 శాతం వ్యాట్ రీఎంబర్స్మెంట్ను ఇవ్వాలని కిరణ్ కుమార్ సర్కారు నిర్ణయించింది. అంతేకాకుండా.. విద్యుత్ సబ్సిడితో పాటు కొత్త పారిశ్రామిక విధానం కింద రాయితీలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. కానీ.. పరిశ్రమల శాఖ జాప్యంతో ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాజెక్టును కూడా కోల్పోయినట్లయింది.


Click it and Unblock the Notifications








