భారత రోడ్లపై సూపర్బైక్లు అంత సురక్షితం కాదు!

వాస్తవానికి సూపర్బైక్లు మన భారదేశపు రోడ్లకు పెద్దగా సరిపోవు. అత్యంత శక్తివంతమైన ఇంజన్ కలిగి ఉండి, సుమారు గరిష్టంగా గంటకు 200-300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ సూపర్బైక్లను మన రోడ్లపై నడపటం కష్టం. నిత్యం రద్దీగా ఉండే మన దేశపు రోడ్లపై ఇలాంటి వాహనాలను నియంత్రించడం కూడా పెద్ద సమస్యే.
సూపర్బైక్లను రైడ్ చేయడానికి ప్రత్యేకమైన శిక్షణ మరియు నైపుణ్యం అవసరం. మన రాష్ట్రంలో ఇలాంటిదే మరో విచారకర సంఘటన గతంలో కూడా చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు తనయుడు కోటా వినయ ఆంజనేయ ప్రసాద్ కూడా ఓ సూపర్బైక్ను రైడ్ చేస్తూ ప్రమాదవశాత్తూ డివైడర్ను ఢీకొట్టి అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ కార్ ర్యాలీ డ్రైవర్ మరియు బైక్ రేసర్ గౌరవ్ గిల్ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. "సూపర్బైక్లు గంటకు 300 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి. దీన్ని ఎవరైనా చేయొచ్చు. అయితే, సూపర్బైక్లు వెళ్తున్నంత వేగంగా వీటి పట్ల నైపుణ్యం పెరగడం లేదు, అత్యవసర సమయాల్లో వీటిని ఎలా అదుపు చేయాలో తెలుసుకోవడం విఫలమవుతున్నారు. అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయ"ని అన్నారు.
సూపర్బైక్లు చిన్న సైజు రాకెట్ లాంటిదని, ఇన్టైమ్లో వీటిని ఎలా ఆపాలో తెలియకపోతే, రెప్పపాటులో అంతా ముగిసిపోతుందని గిల్ అన్నారు. ఇటువంటి ప్రమాదాలను అరికట్టేందుకు సూపర్బైక్లకు లైసెన్సులను నియంత్రించడం ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications








