మూడోసారి భారత్లోకి ప్రవేశించనున్న వెస్పా స్కూటర్

వెస్పా ఎల్ఎక్స్ 125 విడుదల తర్వాత తమ స్వంత బ్రాండ్ పేరుతో ఉన్న అన్ని రకాల వాహనాలను పరిచయం చేయనుంది. వీటితో పాటు మోటార్సైకిళ్లు, ఇతర బ్రాండ్లను కూడా కంపెనీ విడుదల చేయనుంది. ప్రస్తుతం ఉన్న వెస్పా బ్రాండ్లలో ఏడు స్కూటర్లు, మోటార్సైకిళ్లు, చిన్న వాణిజ్య వాహనాలు ఉన్నాయి. భారత ద్విచక్ర వాహన మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపడానికి కంపెనీ ఇటీవల ప్రిమియం "అప్రిలియా" రేంజ్ సూపర్బైకును దిగుమతి చేసుకుంది. దీని ధరల శ్రేణి రూ. 13 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఆప్రిలియా తమ బ్రాండ్ ఇమేజ్ను నిలబెడుతుందని, బెంగుళూరు, చెన్నయ్, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పూణేలలోని డీలర్ల ద్వారా ఈ సూపర్బైక్ మార్కెటింగ్ చేయబడుతుందని పియాగ్గియో వెహికల్స్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. గత 2004లోనే ఆప్రిలియాను భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రవేశపెట్టాల్సి ఉండగా.. అది కాస్తా వాయిదా పడుతూ వచ్చింది. 2012 తొలి త్రైమాసికంలో వెస్పా ఎల్ఎక్స్ 125ను అధికారికంగా విక్రయిస్తామని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








