డీజిల్ బుల్లెట్ బైక్లను పునఃప్రవేశపెట్టనున్న రాయల్ ఎన్ఫీల్డ్!

చెన్నై కేంద్రంగా ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్, భవిష్యత్తులో 750 సీసీ ఇంజన్ కలిగిన మోటార్సైకిళ్లను కూడా భారత్కు పరిచయం చేయాలని భావిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండి మోటార్సైకిల్ సెగ్మెంట్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న బుల్లెట్ (డుగు.. డుగు.. మోటార్సైకిల్) బైకులకు భారతీయుల నుండి ఇప్పటికీ అశేష ఆదరణ లభిస్తోంది. దేశంలోకి ఎన్ని విదేశీ మోడళ్లు వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ తయారు చేసే క్లాసిక్ మోటార్సైకిళ్లకు సాటి రావనే చెప్పొచ్చు.
మనదేశంలో అత్యల్పంగా మోటార్సైకిళ్లను తయారు చేసే కంపెనీ కూడా రాయల్ ఎన్ఫీల్డే. ఈ బైక్లకు కంపెనీ ఉత్పత్తికి మించిన డిమాండ్ ఉంది. అయినప్పటికీ.. కంపెనీ ఏటా 75,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు చెన్నైలో మరో ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని కంపెనీ నిర్ణయించింది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ రేంజ్లో అందిస్తున్న కొన్ని రకాల మోడళ్లకు వివిధ ప్రాంతాల్లో దాదాపు 12 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉంటోంది.
అంటే ఈ మోడళ్లకు అంత డిమాండ్ అన్నమాట. ఏదైతేనేం, పెట్రోల్ ధరలు భగ్గుమంటున్న నేటి రోజుల్లో ఇలాంటి డీజిల్ బైక్ల ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. త్వరలోనే రాయల్ ఎన్ఫీల్డ్ మన కోసం డీజిల్ మోటార్సైకిళ్లను పునఃప్రవేశపెట్టాలని కోరుకుందాం..!!


Click it and Unblock the Notifications








