భారత మార్కెట్ కోసం ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్: యమహా

పెరుగుతున్న ఇంధన ధరలను గమనిస్తే... ఎలక్ట్రిక్ బైకుల ఓ చక్కని ప్రత్యామ్నాయని, ప్రస్తుతం జపాన్, యూరప్ మార్కెట్లలో తమ ఎలక్ట్రిక్ బైకులను విక్రయిస్తున్నామని, ఈ ఉత్పత్తులను భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉందని ఇండియా యమహా మోటార్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) జున్ నకటా తెలిపారు. అయితే.. వీటిని భారత్లో ఎప్పుడు విడుదల చేసేది, మరియు వాటి సాంకేతిక ప్రత్యేకతలు వంటి పూర్తి వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
కాగా.. భారత్లో యమహా స్కూటర్ విభాగం గురించి ప్రశ్నించగా.. నకటా సమాధానమిస్తూ.. స్కూటర్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నామని, జపాన్లో ప్రస్తుతం భారత మార్కెట్కు అనుగుణంగా ఓ స్కూటర్ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టడానికి ఊహించిన సమయం కన్నా ఎక్కువ సమయమే పడుతుందని, ఎందుకంటే కంపెనీ భారత వినియోగదారులకు మెరుగైన సేవలు అందిచాలని భావిస్తుందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








