ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచనున్న యమహా

Yamaha Bike
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్ధ ఇండియా యమహా మోటార్ వచ్చే ఏడాది నాటికి రూ.50 కోట్ల పెట్టుబడులను వెచ్చించి అదనంగా సాలీనా నాలుగు లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించనున్నట్లు పేర్కొంది. తమ ఉత్పత్తులకు చాలా మంచి డిమాండ్‌ను కళ్లజూస్తున్నామని, ఉత్పత్తిని, అమ్మకాలను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇండియా యమహా మోటార్ నేషనల్ బిజినెస్ హెడ్ రాయ్ కురియన్ తెలిపారు.

ప్రస్తుతం ఏటా 6 లక్షలుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల యూనిట్లకు పెంచుకోనున్నామని ఆయన చెప్పారు. ఉత్తర ప్రదేశ్‌లోని సూరజ్‌పూర్‌ ప్లాంటులో ఉత్పత్తిని పెంచనున్నామని కురియన్ చెప్పారు. ఫరీదాబాద్‌లో కూడా యమహాకు ఓ ప్లాంట్ ఉంది, ఇందులో ఇంజన్‌లు ఉత్పత్తి అవుతాయి. 2014 నాటికి దేశీయ మార్కెట్లో 10 లక్షల వాహనాలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. వచ్చే జనవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పో కంపెనీ తమ స్కూటర్లను ప్రదర్శించనుంది.

More from DriveSpark

Article Published On: Friday, November 18, 2011, 11:37 [IST]
English summary
Japan based two-wheeler manufacturer India Yamaha Motor said it will increase the production capacity by 4 lakh units next year with an investment of about Rs 50 crore at Surajpur plant in Uttar Pradesh.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+