ఎఫ్జెడ్ బైక్లపై పెరుగుతున్న క్రేజ్..: భారీ వృద్ధి బాటలో యమహా

మే 2010లో ఇండియా యమహా మోటార్ దేశీయ మార్కెట్లో 17,614 ద్విచక్ర వాహనాలను విక్రయిస్తే.. మే 2011లో 27,959 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ మొత్తం విక్రయాలను (ఎగుమతులను కూడా కలిపి) పరిశీలిస్తే.. అవి 55 శాతం వృద్ధి చెంది 25,033 యూనిట్ల నుంచి 38,812 యూనిట్లకు పెరిగాయి. అలాగే, కేవలం ఎగుమతులను మాత్రమే గమనించినట్లయితే అవి 46.28 శాతం వృద్ధిని సాధించి 7,419 యూనిట్ల నుంచి 10,853 యూనిట్లకు పెరిగాయి. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎఫ్జెడ్, ఎస్జెడ్ సిరీస్ బైక్ల వల్లే ఇంత వృద్ధిని సాధించగలిగామని, వీటికి మార్కెట్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని ఇండియా యమాహా మోటార్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హిరోయుకి సుజుకి తెలిపారు.


Click it and Unblock the Notifications








