గ్రామీణ మార్కెట్ల కోసం యమహా చవక బైక్లు!

ఈ నేపథ్యంలో యమహా కూడా గ్రామీణ మార్కెట్ల కోసం తక్కువ ధర కలిగిన మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ప్రీమియం బైక్-మేకర్గా తమకున్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా అర్బన్ మార్కెట్లలో మంచి విక్రయాలను కళ్లజూస్తున్నామని, ఇకపై గ్రామీణ మార్కెట్లలోనూ తమ స్థానాన్ని పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తామని ఇండియా యమహా మోటార్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
గడచిన సంవత్సరం (2010)లో యమహా 3.8 లక్షల మోటార్సైకిళ్లను విక్రయించింది. కాగా.. ఈ ఏడాది ఈ సంఖ్యను 5.2 లక్షలకు పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఎఫ్జెడ్, ఫేజర్, ఆర్15, క్రక్స్, వైబిఆర్, ఎస్జెడ్ సిరీస్ మోటార్సైకిళ్లను యమహా విక్రయిస్తోంది. గ్రామీణ మార్కెట్ల నుండి అమ్మకాలు నెమ్మదిగా వృద్ధి చెందుతుండటంతో దాదాపు అన్ని కంపెనీలు ఆ మార్కెట్ల వైపు అడుగులు వేస్తున్నాయి.
యమహా అమ్మకాలలో దాదాపు 40 శాతం అమ్మకాలు గ్రామీణ మార్కెట్ల నుండే వస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని షోరూమ్లను, తక్కువ ధర కలిగిన మోడళ్లను అందించాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 400 డీలర్లు ఉన్నారని, త్వరలోనే వీటి సంఖ్యను పెంచుకోనున్నామని, రూరల్ మార్కెట్ కోసం యమహా క్రక్స్, వైబిఆర్ 110లు ప్రధానమైన ఉత్పత్తులని ఆయన చెప్పారు. ఇవికాకుండా భారత మార్కెట్ కోసం యమహా ఓ స్కూటర్ను కూడా అభివృద్ధి చేస్తున్న విషయం విదితమే.


Click it and Unblock the Notifications








