తమిళనాడులో యమహా మూడో ప్లాంటు ఏర్పాటు!

ఆటోమొబైల్ హబ్‌గా ఎదుగుతున్న తమిళనాడు అనేక వాహన తయారీ కంపెనీలను అయస్కాంతంలా ఆకర్షిస్తోంది. ఇప్పటికే బిఎమ్‌డబ్ల్యూ, హ్యుందాయ్, ఫోర్డ్, డైమ్లర్, టివిఎస్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి హేమాహేమీ కంపెనీలు తమిళనాడులో తమ ఉత్పత్తి, వ్యాపారా కార్యకలాపాలు కొనసాగిస్తుండగా.. తాజాగా, జపాన్ ద్విచక్ర వాహన దిగ్గజం యమహా కూడా తమిళనాడును చూసి ఆకర్షతిమైంది.

యమహా భారత్‌లో తమ మూడవ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు గానూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో స్థలాలు, మార్కెట్ పరిస్థితుల గురించి పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ మూడో ప్లాంటు ఏర్పాటు తమిళనాడు అన్నివిధాల (ముఖ్యంగా ఎగుమతులకు) అనువని యమహా భావించినట్లుంది. తమిళనాడులో యమహా ఇప్పటి స్థలాన్ని కూడా గుర్తించినట్లు సమాచారం.

వచ్చే నెల లేదా మే నెలలో తమిళనాడు సర్కారుతో యమహా ఓ పరస్పర సహకార ఒప్పందాన్ని కుదుర్చుకునే ఆస్కారం ఉంది. భారత మార్కెట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటుగా త్వరలో స్కూటర్లను కూడా మార్కెట్లో విడుదల చేయనున్న నేపథ్యంలో డిమాండుకు అనుగుణంగా ఉత్పత్తులను అందించేందుకు సిద్ధంగా ఉండేందుకు గానూ యమహా మూడో ప్లాంటును ఏర్పాటు చేయనుంది.

గడచిన ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో యమహా ఆవిష్కరించిన చేసిన 'యమహా రే' స్కూటర్ ఈ దీపావళి నాటికి భారత మార్కెట్లో వాణిజ్యపరంగా విడుదలయ్యే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, March 27, 2012, 17:11 [IST]
English summary
Yamaha is planning to set up its third manufacturing plant in India and had earlier said it was looking at locations in Karnataka and Tamil Nadu. Unnamed government officials have stated that Yamaha has already identified the location for its third plant in Tamil Nadu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+