రేపటితో ముగియనున్న మహీంద్రా డబుల్ ధమాకా ఆఫర్
ఫిబ్రవరి ధమాకా సేల్స్ కింద ఇప్పటికే పలు ఆటో కంపెనీలు వివిధ ఆఫర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపటితో (29) ఫిబ్రవరి నెల ముగియనుండటంతో ఈ ఆఫర్లు కూడా ముగిసిపోనున్నాయి. ఇందులో భాగంగానే, దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు చెంది ద్విచక్ర వాహన విభాగం "మహీంద్రా టూ వీలర్స్" తమ ద్విచక్ర వాహనాలపై రెండు ఆఫర్లను అందిస్తోంది.
అందులో ఒకటి హీంద్రా ఫ్లయిట్ లేదా రోడియో స్కూటర్ కొనుగోలుపై ఉచిత బీమా సౌకర్యం, మరొకటి ఎక్స్ఛేంజ్ బోనస్ ఆఫర్. మొదటి ఆఫర్లో భాగంగా మహీంద్రా ఫ్లయిట్ లేదా మహీంద్రా రోడియో స్కూటర్ను కొనుగోలు చేసే వారికి ఉచిత బీమాను కంపెనీ అందిస్తోంది. రెండవ ఆఫర్లో భాగంగా పాత వాహనాపు రీసేల్ వ్యాల్యూ కన్నా అదనపు మొత్తాన్ని కంపెనీ అందిస్తోంది.
ఈ డబుల్ ధమాకా ఆఫర్లు బుధవారం (ఫిబ్రవరి 29)తో ముగియనున్నాయి. ఇవే కాకుండా స్పాట్ ఎక్స్ఛేంజ్, స్పాట్ ఫైనాన్స్, స్పాట్ డెలివరీ వంటి సదుపాయాలను కూడా మహీంద్రా టూ వీలర్స్ అందిస్తోంది. మరింకెందుకు ఆలస్యం మంచి తరుణం మించిపోక ముందే మీ మహీంద్రా స్కూటర్ను సొంతం చేసుకోండి.


Click it and Unblock the Notifications









