డ్యూక్ 200 బుకింగ్ అమౌంట్ను తగ్గించిన కెటిఎమ్

అయితే, ఆ తర్వాత బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్ బైక్ విడుదల కావడంతో కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ను చేసుకున్నా వారు తమ బుకింగ్లను రద్దు చేసుకని పల్సర్ 200ఎన్ఎస్ను బుక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రద్దు చేసుకున్న కెటిఎమ్ బుకింగ్లకు కంపెనీ రూ.3,000 వసూలు చేస్తుంది. అంతేకాకుండా కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ వెయిటింగ్ పీరియడ్ కూడా 90 రోజులుగా ఉండటంతో కొనుగోలుదారులు బుకింగ్లను రద్దు చేసుకుంటాన్నారు.
ఈ నేపథ్యంలో బుకింగ్లను కాపాడుకోవటానికి, కొత్త బుకింగ్లను ఆకర్షించడానికి గానూ, డ్యూక్ 200 బుకింగ్ మొత్తాన్ని కెటిఎమ్ రూ.30,000 నుండి రూ.20,000 లకు తగ్గించింది. కెటిఎమ్ డ్యూక్ 200 ధర రూ.1.17 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. దీని ఆన్-రోడ్ ధర సుమారు రూ.1.3 లక్షల లోపుగానే ఉంటుంది. అన్ని బజాజ్ ప్రోబైకింగ్ షోరూమ్లలో కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ను బుక్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








