జిపిఎస్, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ ఆల్ ఇన్ వన్: కార్ప్యాడ్ 5
ప్రముఖ జిపిఎస్, నావిగేషన్ సిస్టమ్ల తయారీ కంపెనీ 'మ్యాప్ మై ఇండియా' మరో సరికొత్త ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టింది. కంపెనీ విడుదల చేసిన 'కార్ప్యాడ్ 5' అనే జిపిఎస్ సిస్టమ్ కేవలం జిపిఎస్ ట్రాకింగ్ కోసం మాత్రమే కాకుండా, స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, ఎంటర్టైన్మెంట్ సిస్టమ్గా కూడా ఉపయోగపడుతుంది. ఈ ఆల్-ఇన్ 'కార్ ప్యాడ్ 5' జిపిఎస్ సిస్టమ్ యొక్క విశిష్టమైన ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి:
* ఇన్-కార్ జిపిఎస్ నావిగేషన్, 3జి టాబ్లెట్, స్మార్ట్ ఫోన్ - ఆల్ ఇన్ వన్
* 12.7 సెం.మీ. (5 ఇంచ్) కలర్ టచ్స్క్రీన్
* శాంసంగ్ 1 గిగా హెడ్జ్ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్
* ఫోన్, ఇంటర్నెట్ కోసం బిల్ట్ ఇన్ 3జి సిస్టమ్
* గూగుల్ ప్లే స్టోర్
* 1080పి హెచ్డి వీడియో ప్లేబ్యాక్
* 8 జిబి అంతర్గత మెమరీ
కార్ప్యాడ్ 5 ద్వారా 3జి స్పీడ్తో లొకేషన్లను గుర్తించడం, ఫోన్ కాల్స్ చేయటం, డేటా సర్ఫింగ్, యూట్యూబ్, వీడియో ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్ వంటి పనలు చేసుకోవచ్చు. ఇంకా ఇందులో సిమ్ కార్డ్, వాయిస్ కాలింగ్, బ్లూటూత్ కెనెక్టివిటీ, ఎస్ఎమ్ఎస్, ఎక్స్పాండబల్ మెమరీ వంటి విశిష్టమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.
కార్ప్యాడ్ 5 నావిగేషన్ సిస్టమ్ ధర రూ.19,990 లుగా ఉంది. అన్ని అధీకృత మ్యాప్ మై ఇండియా డీలర్ల వద్ద ఇది లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా కూడా ఈ సిస్టమ్ను ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్న వివరాలకు మ్యాపై మై ఇండియా వెబ్సైట్ను సందర్శించండి.


Click it and Unblock the Notifications









