తమిళనాడులో యమహా మోటార్సైకిల్ ప్లాంట్
తమిళనాడు రాష్ట్రం ఆటోమొబైల్ హబ్గా మారిపోతుంది. ఆ రాష్ట్ర సర్కారు అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలతో దేశవిదేశాలకు చెందిన ఆటోమొబైల్ కంపెనీలు తమిళనాడులు కాలు మోపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే జపాన్కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ కంపెనీ ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ తమిళనాడులో ఓ కొత్త ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడు సర్కారుతో ఈ జపాన్ కంపెనీ ఓ పరస్పర సహకార ఒప్పందంపై సంతకం కూడా చేసింది.
ప్రస్తుతం ఇండియా యమహా మోటార్కు ఉత్తర ప్రదేశ్లోని సూరజ్పూర్, హర్యానాలోని ఫరీదాబాద్లలో రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి. భారత్లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంలో భాగంగా ఈ కొత్త ప్లాంటును స్థాపించనున్నామని కంపెనీ పేర్కొంది.
చెన్నై సరిహద్దులో ఉన్న వెల్లమ్ వడగల్ పారిశ్రామిక ప్రాంతంలో సుమారు 4,40,000 చ.మీ. విస్తీర్ణంలో ఓ కొత్త ప్లాంటును నిర్మిస్తామని యమహా తెలిపింది. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ ప్లాంటు ద్వారా 1,800 మంది ఉపాధి పొందనున్నారు. సాలీనా 4 లక్షల యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి సాధించేలా ఈ ప్లాంటును నిర్మిస్తున్నామని, ప్రారంభంలో భాగంగా తొలుత 1.8 లక్షల యూనిట్లతో ప్రారంభించి 2018 నాటికి నాలుగు లక్షల యూనిట్ల స్థాయికి చేర్చుతామని, అప్పటికి సుమారు 6,500 మందికి ఉపాధి లభించగలదని కంపెనీ
రానున్న ఐదేళ్లలో ఈ కొత్త ఫ్యాక్టరీపై సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నామని యమహా తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 400 లకు పైగా డీలర్షిప్లను కలిగిన ఉన్న ఇండియా యమాహా మోటార్ కంపెనీ దేశీయ విపణిలో విమ్యాక్స్, ఎమ్టి01, వైజెడ్ఎఫ్-ఆర్1, ఎఫ్జెడ్1, ఫేజర్, ఎఫ్జెడ్-ఎస్, ఎఫ్జెడ్, ఎస్జెడ్, ఎస్జెడ్-ఎక్స్, ఎస్జెడ్-ఆర్, వైజెడ్ఎఫ్-ఆర్15 వెర్షన్ 2.0, ఎస్ఎస్125, వైబిఆర్ 110, క్రక్స్ మోడళ్లను అందిస్తోంది.


Click it and Unblock the Notifications









