చెన్నైలో కొత్త షోరూమ్ను ప్రారంభించిన హ్యోసంగ్
కొరియన్ బైక్ మేకర్ 'హ్యోసంగ్' అందిస్తున్న స్పోర్ట్స్ బైక్స్, సూపర్ బైక్స్, లీజర్ బైక్స్ ఇప్పుడు చెన్నై మార్కెట్లో కూడా లభ్యం కానున్నాయి. పూణేకు చెందిన డిఎస్కే మోటోవీల్స్తో చేతులు కలిపి హ్యోసంగ్ భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసినదే. డిఎస్కే మోటోవీల్స్ చెన్నైలో తాజగా హ్యోసంగ్ షోరూమ్ను ప్రారంభించింది. చైన్నైలో జెఎమ్బి మిలీనియం మోటార్స్ హ్యోసంగ్ బైక్లకు అధికారిక డీలర్షిప్గా వ్యవహరించనుంది.
చెన్నైలోని స్కై వాక్ మాల్ వెనుక ఉన్న నెల్సన్ మానిక్యం రోడ్లో జెఎమ్బి మిలీనియం మోటార్స్ ఉంది. ఈ షోరూమ్లో ఎస్టి7, జిటి 650 ఎన్, ఆక్విలా ప్రో, జిటి 250 ఆర్ మరియు 2013 మోడల్ జిటి 650 ఆర్ బైక్లు లభ్యం కానున్నాయి. ఈ షోరూమ్ సేల్స్, సర్వీస్ మరియు స్పేర్స్లను ఆఫర్ చేస్తుంది. హ్యోసంగ్కు భారత్లో ఇది 25వ షోరూమ్ కావటం విశేషం. హ్యోసంగ్కు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో షోరూమ్లు ఉన్నాయి.
మన రాష్ట్రంలో, హైదరాబాద్లోని 'లగ్జరీ ఆన్ వీల్స్' హ్యోసంగ్ బైక్లకు అధీకృత డీలర్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసినదే. రాజ్భవన్ రోడ్లోని సోమాజిగూడలో ఉన్న శాంతి శిఖర కాంప్లెక్స్లో ఈ షోరూమ్ ఉంది.

హ్యోసంగ్ ఆక్విలా ప్రో

హ్యోసంగ్ జిటి 250 ఆర్

2013 హ్యోసంగ్ జిటి 650 ఆర్

హ్యోసంగ్ ఎస్టి7



Click it and Unblock the Notifications








