మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర; లీటరుకు రూ.2కు పైగా వడ్డింపు

అసలే పెరిగిన నిత్యావసర ధరలతో బాధపడుతున్న సమాన్యులకు తాజా పెంపు మరింత భారం కానుంది. స్థానిక పన్నులు కలుపుకుంటే హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.2.38 పైసల మేర పెరిగింది. ఇదివరకు లీటర్ పెట్రోల్ ధర రూ.72.46గా ఉండేది. తాజా పెంపుతో ఇది రూ.74.84కు పెరిగింది. పెరిగిన పెట్రోల్ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి.
చమురు కంపెనీలు ఈ నెల 1వ తేదీన లీటరు పెట్రోల్పై 75 పైసలు చొప్పున అలాగే, 16వ తేదిన రూ.2 చొప్పున పెంచిన సంగతి తెలిసినదే. మొత్తమ్మీద చూసుకుంటే ఒక్క నెల కాలంలో పెట్రోల్ ధర లీటరుపై సుమారు రూ.5 లకు పైగా పెరిగింది. ఇదిలా ఉండే వచ్చే వారం డీజిల్ ధరను కూడా 40-50 పైసల చొప్పున పెంచాలని చమురు కంపెనీ యోచిస్తున్నాయి.


Click it and Unblock the Notifications








