మరోసారి తగ్గిన పెట్రోల్ ధర; లీటరుపై రూ.2 వరకూ తగ్గింపు
ఆగస్ట్ నెలలో వరుసగా రెండోసారి పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఆగస్ట్ 15న లీటరుపై రూ.1.89 పైసల నుంచి రూ.2.38 పైసల చొప్పున ధరలను తగ్గించిన ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తాజాగా మరోసారి పెట్రోల్ ధరను తగ్గించాయి.
ఆగస్ట్ 30, 2014వ తేది అర్థరాత్రి నుంచి చమురు కంపెనీలు పెట్రోల్ ధరను లీటరుపై రూ.1.82 పైసల చొప్పున (స్థానిక పన్నులు కలుపుకోకుండా) తగ్గింపును ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ క్రమంగా తగ్గుతుండటంతో, దేశీయ చమురు కంపెనీలు కూడా పెట్రోల్ ధరను తగ్గించాయి.

క్రూడ్ ఆయిల్ ధరలు ఆల్టైమ్ కనిష్టంగా 13 నెలలకు పడిపోయాయి. కాగా.. డీజిల్ ధరలో మాత్రం ఎలాంటి తగ్గింపును ఇవ్వకపోగా, ప్రతినెలా డీజిల్ ధరను పెంచుతున్నట్లుగానే ఈసారి కూడా డీజిల్ ధరను 50 పైసలు చొప్పున పెంచారు.
అతర్జాతీయ మార్కెట్లలోని ధరలను అనుసరించి భారత్లో పెట్రోల్ ధరను నిర్ణయిస్తున్నట్లుగానే, డీజిల్ ధర విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం డీజిల్ను సబ్సిడే రేటు విక్రయిస్తున్నంద వలన వస్తున్న నష్టాలను పూర్తిస్థాయిలో భర్తీ చేసుకున్న తర్వాత, ఈ ఇంధన ధరలకు కూడా స్వేచ్ఛ కల్పించడం జరుగుతుంది.


Click it and Unblock the Notifications








