రాయల్ ఎన్ఫీల్డ్ నోరు మూయించనున్న బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు?
చాలా సంవత్సరాలుగా రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ లలో రారాజుగా ఉంది. చాలా మంది వాహన ప్రియులు తమ సొంత పిల్లల్లాగా వీటిని చూసుకుంటున్నారు.
ఎలాగైతేనేం, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లు ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందాయి. చాలా మంది యువత వీటి మీద రైడ్ చేయడానికి ముందు కంటే ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

యువ కొనుగోలుదారులతో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లు వేగంగా మరియు ఎక్కువగా అమ్ముడవడానికి దోహదపడుతున్నాయి. మఫ్లర్ల అమ్మకాల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రాయల్ ఎన్ఫీల్డ్ ను సైలెంట్ చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమ వాహనాల్లోని ఎక్జాస్ట్ సిస్టమ్ లను మార్చుకోవాలని వాహన యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కువ డెసిబెల్స్ ఉత్పత్తి అయితే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు.

మోటార్ సైకిళ్లు 84 డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేయకూడదు. అయినా మోటార్ సైకిళ్లు పరిమితికి మించిన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. బెంగళూరులో ఇటీవల ధ్వని కాలుష్యం చేస్తున్న 12 వాహనాలను సీజ్ చేశారు.
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ శబ్దం వచ్చేలా వాహనాలను తయారుచేసే వారిపై చర్యలు తీసుకోనున్నారు. నిభందనలను అతిక్రమించిన వారికి రూ,1000 జరిమానా విధించనున్నారు. మరిన్ని అప్ డేట్స్ కోసం చూస్తూ ఉండండి. తెలుగు డ్రైవ్ స్పార్క్.......


Click it and Unblock the Notifications








