అధికారికంగా భారత్ కు వచ్చిన డుకాటి ఢిల్లీలో మొదటి ఔట్ లెట్ ప్రారంభం
ఇటాలియన్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ డుకాటి అధికారికంగా భారత్ కు ప్రవేశింది. తన మొదటి ఔట్ లెట్ ను ఢిల్లీలో ప్రారంభించింది. ఈ మోటార్ సైకిల్ తయారీ సంస్థ రానున్న అక్టోబర్ లో బెంగళూరులో డీలర్ షిప్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
డుకాటి తన మొదటి ఔట్ లెట్ ను ఢిల్లీలో ప్రారంభిస్తూనే రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది.

ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆసియా ప్రాంత సేల్స్ మరియు మార్కెటింగ్ మేనేజర్ పియర్ ఫ్రాన్సిస్కో, డుకాటి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రవి అవలూరు హాజరయ్యారు.
ప్రస్తుతం డుకాటి భారత్ లో క్రింది మోడళ్లను ప్రవేశపెట్టింది.
- మాన్స్టర్ 821
- మాన్స్టర్ ఎస్2ఆర్
- మాన్స్టర్ 795
- హైపర్ మోటార్డ్
- హైపర్ స్ట్రడా
- డయావెల్ 899
- డయావెల్ 1299
- డయావెల్ 1299ఎస్
- పనిగేల్ ఆర్

ప్రపంచంలో మిగతా ప్రాంతాల్లో లాగే భారత్ లోను సర్వీసులను ప్రారంభించి కస్టమర్లలో మంచి పేరు పొందటమే డుకాటి తన లక్ష్యంగా పెట్టుకుంది.

డుకాటి ఈ ఏడాది ముగింపులోపు బెంగళూరు, పూనే మరియు హైదరాబాద్ లాంటి అనేక ప్రాంతాల్లో తమ ఔట్ లెట్ లను ప్రారంభించనుంది.




Click it and Unblock the Notifications








