హై కెపాసిటి బైకులకు కొత్త లైసెన్స్ విధానాన్ని ప్రకటించనున్న భారత ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలలో టూవీలర్ల కారణంగానే ఎక్కువగా జరగుతున్నట్లు కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి. అందుకోసం భారత ప్రభుత్వం వీటిని అరికట్టడానికి ఒక కొత్త డ్రైవింగ్ లైసెన్స్ విధాన్ని అమలు పరచనుంది. ప్రత్యేకంగా టూ వీలర్ల లైసెన్స్లను మంజూరు చేసే విషయంలో తీవ్ర మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
మరింత చదవండి: శ్వేత విప్లవం సృష్ఠించనున్న బజాజ్ పల్సర్ ఆర్యస్200
ప్రస్తుతం దేశం వ్యాప్తంగా ద్విచక్ర వాహనాలకు సంభందించి రెండు రకాల డ్రైవింగ్ లైసెన్స్లను అందిస్తోంది. గేర్లు లేని టూ వీలర్లు అనగా ఆక్టివా, జూపిటర్ వంటి స్కూటర్లు మరియు గేర్లు గల ద్విచక్ర వాహనాలుకు మంజూరు చేసే లైసెన్స్లు. కాని కొంత మంది స్కూటర్లకు చెందిన లైసెన్స్లను కలగిన వారు ఎక్కువ సీసీ గల టూ వీలర్లను నడపడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసింది. అందుకోసం భారత ప్రభుత్వం ద్విచక్ర వాహనాలకు సంభందించి మరొ రకం లైసెన్స్ను అందుబాటులోకి తీసుకురానుంది.
మరింత చదవండి: భారతదేశపు భవిష్యత్తు మోటార్ సైకిల్స్.... మరి ఇందులో దేనిని ఎంచుకుంటారు
ఎక్కువ సీసీ గల వాహనాలను నడిపే వారి కోసం ప్రత్యేకంగా 500సీసీ పైబడిన కెపాసిటి గల వాహనదారులు ఖచ్చితంగా ఈ లైసెన్స్ను పొందవలసి ఉంటుంది. దీని ద్వారా ఎక్కువ కెపాసిటి గల వాహనాల ద్వారా జరిగే ప్రమాదాలను అరికట్టవచ్చని ప్రభత్వం అంచనా. నిజమే ఈ కొత్త విధానం అమలులోకి వస్తే ఎంతో మేలు. అయితే ఇప్పటికే ఇలాంటి విధానాలను చాలా దేశాలలో అందుబాటులో ఉంది.
Also Read: భారతీయులు అత్యధికంగా ఇష్టపడుతున్న టాప్-10 టూవీలర్లు



Click it and Unblock the Notifications








